పాక్ చిరకాలం వర్థిల్లాలి.. డ్రోన్లు, మిలిటరీ సప్లై ఆగదు.. టర్కీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు..!
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పూర్తి స్థాయిలో విజయవంతం అయింది. ఉగ్రమూకలను ఏరి పారేయడంలో భారత్ చూపిన శక్తిసామర్థ్యాలు ప్రపంచ దేశాలను అబ్బుర పరిచాయి. ఇక దాయాది పాకిస్థాన్ కైతే భారత్ చుక్కలు చూపించింది. అటు సైనిక స్థావరాలపై దాడి చేసి పాక్ కు వణుకు పుట్టించింది. పలు ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకుని పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ తీసింది.
భారత్- పాకిస్థాన్ యుద్ధం సమయంలో పాకిస్థాన్ కు డ్రోన్లు, మిలిటరీని సాయం చేసింది టర్కీ. పహల్గాం ఉగ్రదాడిని సైతం టర్కీ, అజర్ బైజాన్ లాంటి దేశాలు సమర్థిస్తూ వచ్చాయి. అయితే తాజాగా మరోసారి టర్కీ తన బుద్ధిని చూపించింది. ఈ మేరకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎర్డోగన్ కు షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. యుద్ధంలో తమకు సాయం చేసినందుకు కృతజ్ఞతలు అంటూ షరీఫ్ వ్యాఖ్యానించారు.

ఇరు దేశాధినేతల సమావేశం అనంతరం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. ఎక్స్ వేదికగా స్పందించారు. "నా సోదరుడు ఎర్డోగన్ తో సమావేశం కావడం సంతృప్తిగా అనిపించింది. భారత్- పాకిస్థాన్ యుద్దంతో మాకు సాయం చేసినందుకు కృతజ్ఞతలు. ఇరు దేశాల మధ్య సైనిక, మిలిటరీ అంశాలపై చర్చించాం. వాణిజ్యం.. వ్యాపార లావాదేవీలపైనా పలు నిర్ణయాలు తీసుకున్నాం. లాంగ్ లీవ్ పాకిస్థాన్- టర్కీ ఫ్రెండ్ షిప్" అని పాక్ ప్రధాని షెహబాజ్ ట్వీట్ చేశారు.
మరోవైపు ఇరు దేశాల సమావేశంపై టర్కీ అధ్యక్షుడు తయ్యప్ ఎర్డోగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. " నా ప్రియమైన స్నేహితుడు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో సమావేశం కావడం జరిగింది. వాళ్లకు ఆతిథ్యం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. ఎకానమీ, వ్యాపారం, భద్రత తదితర అంశాలపై కీలక చర్చలు జరిపాం. ఇరు దేశాల మధ్య ప్రతి అంశంలో ఒక అభిప్రాయానికి వచ్చాం. మా మధ్య ఈ సత్సంబంధాలు చిరకాలం కొనసాగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా" అని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
Bugün Pakistan Başbakanı, kıymetli dostum Sayın Şahbaz Şerif ile değerli heyetini İstanbul’da misafir etmekten büyük memnuniyet duydum.
— Recep Tayyip Erdoğan (@RTErdogan) May 25, 2025
Kendileriyle ekonomi, ticaret, güvenlik başta olmak üzere birçok kritik konuyu ele aldık.… https://t.co/HW7OSviI7G
టర్కీ ఆపదలో ఉన్నప్పుడు భారత్ చేసిన సాయం మరిచి ఇప్పుడు పాకిస్థాన్ కు సపోర్ట్ చేయడంపై భారత్ లో టర్కీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో బాయికాట్ టర్కీ అనే నినాదం దేశవ్యాప్తంగా వెల్లువెత్తింది. టర్కీతో వాణిజ్య సంబంధాలు తెంచుకోవాలని నెటిజెన్లు అభిప్రాయపడ్డారు. టర్కీ నుంచి పలు వస్తువులను భారత్ బ్యాన్ చేసింది. ఈ క్రమంలో టర్కీ- పాకిస్థాన్ మధ్య చర్చలు జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications