సౌదీ కింగ్ అబ్దుల్లా మృతికి ప్రణబ్ సంతాపం, ప్రధాని మోడీ దిగ్ర్భాంతి(ఫోటోలు)
న్యూఢిల్లీ: సౌదీ అరేబియా కింగ్ అబ్దుల్లా మృతికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాపం తెలిపారు. ఈ సందర్బంలో ఆయన మాట్లాడుతూ భారత్తో సౌదీ కింగ్ అబ్దుల్లాకి మంచి సంబంధాలున్నాయని ప్రణబ్ గుర్తు చేశారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడేందుకు అబ్దుల్లా ఎంతో కృషి చేశారని అన్నారు.
సౌదీ అరేబియా ప్రజలు మంచి నాయకుడిని కోల్పోయారని ప్రణబ్ పేర్కొన్నారు. కింగ్ అబ్దుల్లా మృతి పట్ల సంతాపం తెలుపుతూ ప్రణబ్ ట్వీట్టర్లో ట్వీట్ చేశారు.
Heartfelt condolences to the Government and people of Saudi Arabia over the sad demise of King Abdullah of Saudi Arabia #PresidentMukherjee
— President of India (@RashtrapatiBhvn) January 23, 2015 సౌదీ అరేబియా కింగ్ అబ్దుల్లా బిన్ అబ్జులజీజ్ (90) మరణించారు. ప్రపంచంలోనే చమురు ఎగుమతి చేసే వ్యక్తుల్లో అగ్రగణ్యుడిగా పేరుగాంచిన అబ్దుల్లా న్యూమోనియా కారణంగా మరణించారు. అబ్దుల్లా మరణం నేపథ్యంలో ఆయన సోదరుడు సల్మాన్, సౌదీకి నూతన రాజుగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
న్యూమోనియాతో బాధపడుతున్న అబ్దుల్లా, గురువారం రాత్రి ఒంటి గంటకు మరణించినట్లు సౌదీ ప్రభుత్వం అధికారకంగా ప్రకటించింది. 1923లో జన్మంచిన అబ్దుల్లా 2006 నుంచి సౌదీ రాజుగా కొనసాగుతున్నారు.
కింగ్ అబ్దుల్లా మృతిపట్ల ప్రధాని మోడీ దిగ్ర్భాంతి
సౌదీ అరేబియా కింగ్ అబ్దుల్లా మృతిపట్ల భారత ప్రధాని నరేంద్రమోడీ దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితమే అబ్దుల్లా ఆరోగ్యం గురించి ఆయన సోదరుడు, క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ని ఆరా తీసినట్లు మోడీ పేర్కొన్నారు. ఆయన మృతితో మనమంతా ఓ గొప్ప నాయకుడిని కోల్పోయామని అన్నారు.
King Abdullah had genuine warmth &affection for India &our people, was personally committed to improving bilateral ties #PresidentMukherjee
— President of India (@RashtrapatiBhvn) January 23, 2015 
సౌదీ కింగ్ అబ్దుల్లా మృతికి ప్రణబ్ సంతాపం
సౌదీ అరేబియా కింగ్ అబ్దుల్లా మృతికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాపం తెలిపారు. ఈ సందర్బంలో ఆయన మాట్లాడుతూ భారత్తో సౌదీ కింగ్ అబ్దుల్లాకి మంచి సంబంధాలున్నాయని ప్రణబ్ గుర్తు చేశారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడేందుకు అబ్దుల్లా ఎంతో కృషి చేశారని అన్నారు.

సౌదీ కింగ్ అబ్దుల్లా మృతికి ప్రణబ్ సంతాపం
సౌదీ అరేబియా ప్రజలు మంచి నాయకుడిని కోల్పోయారని ప్రణబ్ పేర్కొన్నారు. కింగ్ అబ్దుల్లా మృతి పట్ల సంతాపం తెలుపుతూ ప్రణబ్ ట్వీట్టర్లో ట్వీట్ చేశారు.

సౌదీ కింగ్ అబ్దుల్లా మృతికి ప్రణబ్ సంతాపం
సౌదీ అరేబియా కింగ్ అబ్దుల్లా బిన్ అబ్జులజీజ్ (90) మరణించారు. ప్రపంచంలోనే చమురు ఎగుమతి చేసే వ్యక్తుల్లో అగ్రగణ్యుడిగా పేరుగాంచిన అబ్దుల్లా న్యూమోనియా కారణంగా మరణించారు. అబ్దుల్లా మరణం నేపథ్యంలో ఆయన సోదరుడు సల్మాన్, సౌదీకి నూతన రాజుగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

సౌదీ కింగ్ అబ్దుల్లా మృతికి ప్రణబ్ సంతాపం
న్యూమోనియాతో బాధపడుతున్న అబ్దుల్లా, గురువారం రాత్రి ఒంటి గంటకు మరణించినట్లు సౌదీ ప్రభుత్వం అధికారకంగా ప్రకటించింది. 1923లో జన్మంచిన అబ్దుల్లా 2006 నుంచి సౌదీ రాజుగా కొనసాగుతున్నారు.












Click it and Unblock the Notifications