రష్యాలో మెట్రో పేలుళ్ళకు పాల్పడిన అనుమానితుడి గుర్తింపు
రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో సోమవారం నాడు మెట్రోరైల్వేస్టేషన్లలో పేలుళ్ళకు కిర్గిస్తాన్ కు చెందిన అక్బర్జాన్ డాజ్హాలివో పేలుళ్ళకు పాల్పడినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు.
సెయింట్ పీటర్స్ బర్గ్: రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో సోమవారం నాడు మెట్రోరైల్వేస్టేషన్లలో పేలుళ్ళకు కిర్గిస్తాన్ కు చెందిన అక్బర్జాన్ డాజ్హాలివో పేలుళ్ళకు పాల్పడినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు.అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
రష్యా పౌరసత్వం కలిగి ఉన్నకిర్గిస్తాన్ కు చెందిన అక్బర్జాన్ డాజ్హాలివో పేలుళ్ళకు పాల్పడినట్టు అధికారులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
ఈ పేలుళ్ళ ఘటనలో 14 మంది మరణించగా, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. అనుమానితుడు 1995 ఓషో పట్టణంలో జన్మించినట్టుగా ప్రాథమిక సమాచారం మేరకు గుర్తించారు.
అయితే ఈ ఘటనకు ఆయన ఒక్కడే పాల్పడ్డాడా ఇంకా మరెవరైనా ఆయనకు సహకరించారా అనే విషయం తేలాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.ఈ ఘటనపై పూర్తిస్తాయి విచారణ జరిపితేనే వాస్తవాలు వెల్లడికానున్నాయి.ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.