ఊహించిందే జరిగింది. ఉక్రెయిన్ పైన రష్యా అధ్యక్షుడు పుతిన్ మిలిటరీ ఆపరేషన్ మొదలైందని ప్రకటించారు. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ప్రకటించారు. ఉక్రెయిన్ సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. ఆ దేశం చుట్టూ సుమారు లక్షన్నర మంది రష్యా సైనికులు ఇప్పటికే మోహరించారు. డోన్బాస్ లో ఉక్రెయిన్ బలగాలు వెనక్కు వెళ్లాలని రష్యా హెచ్చరించింది. ఉక్రెయిన్ సైతం తమ బలగాలతో సిద్దం అయింది. ఇప్పటికే ఉక్రెయిన్ లో ఎమర్జెన్సీ ప్రకటించారు. తన దేశం రష్యాకు ముప్పు కలిగిస్తోందన్న మాస్కో వాదనలను ఉక్రేనియన్ అధ్యక్షుడు తిరస్కరించారు. ఇప్పటికే ఉక్రెయిన్ మీదకు సైనిక బలగాలను ఉప సంహరించుకోవాలని ఐక్య రాజ్యసమితి రష్యాకు సూచించింది.
ఇప్పటికే రష్యా ఉక్రెయిన్పై బాంబులతో విరుచుకుపడుతోంది. అక్కడి వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే పలు ప్రపంచ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ రష్యా తీరును తప్పుబట్టారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంకు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్డేట్స్ మీకోసం
Apr 27, 2022, 10:07 am IST
ఉక్రెయిన్ చెర్నోబిల్ అణువిద్యుత్ ప్లాంట్ నుంచి ఎక్కువైన రేడియేషన్
Apr 25, 2022, 9:00 am IST
ఓ వైపు రష్యా దాడులు మితిమీరుతున్నా... ఉక్రెయిన్ ప్రజలు మాత్రం ఎక్కడా తలదించుకోలేదు. ధైర్యంగా ఎదురొడ్డి పోరాడారు. వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపిన జెలెన్స్కీ
Apr 25, 2022, 8:59 am IST
కష్టసమయంలో అండగా నిలిచిన అమెరికాకు ధన్యవాదాలు తెలిపిన జెలెన్స్కీ
Apr 25, 2022, 8:56 am IST
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయిన అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్
Apr 23, 2022, 5:34 pm IST
డాన్బాస్ రీజియన్లో రష్యా సాగిస్తోన్న దాడులను తీవ్రంగా ప్రతిఘటిస్తోన్న ఉక్రెయిన్. ఫలితంగా రష్యా సైనిక బలగాలు తమ దాడుల వేగాన్ని నియంత్రించాయి.
Apr 23, 2022, 5:18 pm IST
మరియోపోల్లోని అజోవ్స్టల్ స్టీల్ ప్లాంట్ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా సైనిక బలగాలు భీకరంగా వైమానిక దాడులు సాగిస్తున్నాయి. మరియోపోల్ రష్యా వశం అయినప్పటికీ.. ఈ స్టీల్ ప్లాంట్ ఇంకా ఉక్రెయిన్ ఆధీనంలోనే ఉండటమే దీనికి కారణం.
Apr 23, 2022, 4:46 pm IST
తమ దేశం తరువాత మిగిలిన దేశాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దండెత్తుతాడని హెచ్చరించిన ఉక్రెయిన్ కౌంటర్ పార్ట్ వొలొదిమిర్ జెలెన్స్కీ. దురాక్రమణ ఉక్రెయిన్తో మాత్రమే ఆగదని పేర్కొన్న జెలెన్స్కీ.
Mar 09, 2022, 11:02 pm IST
రష్యాకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఝలక్ ఇచ్చింది. అ దేశానికి సంస్థలతో సంబంధాలను స్తంభింపజేస్తున్నట్లు వెల్లడించింది. దావోస్ లో వార్షిక సమావేశానికి అనుమతి లేదని తెలిపింది.
Mar 09, 2022, 9:28 pm IST
సుమీ నుంచి 600 మంది భారత విద్యార్థులు ప్రత్యేక రైలులో పోలండ్ బయల్దేరారు. రేపు వీరంతా ప్రత్యేక విమానంలో భారత్ కు బయల్దేరే అవకాశం ఉంది.
Mar 09, 2022, 8:24 pm IST
మరియూపోల్ లో 4లక్షల మంది ప్రజలను రష్యా బందించిందని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి దిమిత్రి కులేబా ఆరోపించారు.
Mar 09, 2022, 4:50 pm IST
పశ్చిమ దేశాల ఆంక్షలపై పుతిన్ ఆగ్రహాం
Mar 09, 2022, 2:11 pm IST
పొలాండ్ సరిహద్దులో ఏడుస్తూ కనిపించిన బాలుడు
Mar 09, 2022, 12:05 pm IST
ఉక్రెయిన్లో చిక్కుకున్న పాకిస్థాన్ విద్యార్థిని కాపాడిన భారత్
India rescues Pakistani student stranded in Ukraine
రష్యాకు నాటో భయపడుతుంది: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ
Mar 09, 2022, 10:12 am IST
జైటోమిర్, ఖార్కివ్ నివాస భవనాలపై వైమానిక దాడులు, ఏడుగురు మృతి, వారిలో ముగ్గురు చిన్నారులు
Mar 09, 2022, 9:59 am IST
రష్యాలో పెప్సీ కోలా బ్యాన్
Mar 09, 2022, 8:23 am IST
ఉక్రెయిన్ కోసమే పెప్సీ కోలాను రష్యాలో నిషేధం విధించామని ప్రకటన
Mar 09, 2022, 7:49 am IST
ఉక్రెయిన్కు రష్యా తయారు చేసిన యుద్ధ విమానాలను ఇవ్వాలనే పోలాండ్ ప్రతిపాదనను అమెరికా తిరస్కరించింది
Mar 09, 2022, 7:47 am IST
ఉక్రెయిన్ కోసమే పెప్సీ కోలాను రష్యాలో నిషేధం విధించామని ప్రకటనలో తెలిపిన కంపెనీ
The Coca-Cola company suspends its business in Russia stating, "Our hearts are with the people who are enduring unconscionable effects from these tragic events in Ukraine."#UkraineRussianWarpic.twitter.com/6i5upBMGts
రష్యాపై అమెరికా ఆంక్షలు విధించింది. రష్యా నుంచి ముడి చమురు, గ్యాస్ , ఇంధన దిగుమతులపై నిషేదం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన చేశారు.
Mar 08, 2022, 9:54 pm IST
రష్యా నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న చమురుపై ఆంక్షలు విధించే దిశగా సిద్ధమవుతున్న ఆదేశ అధ్యక్షుడు జో బైడెన్.
Mar 08, 2022, 8:56 pm IST
స్పుత్నిక్, రష్యా టుడే ప్రసార కార్యకలాపాలను నిలిపివేయాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది.
Mar 08, 2022, 7:53 pm IST
ఉక్రెయిన్ లోని సుమీ నగరం నుంచి భారత విద్యార్థులందరినీ బయటకు తీసుకొచ్చామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తెలిపారు.
Mar 08, 2022, 7:42 pm IST
భారత్ పై ఆంక్షల యోచన అత్యంత మూర్ఖత్వమే అవుతుందని అమెరికాలోని టాప్ రిపబ్లికన్ సెనెటర్ అన్నారు.
Mar 08, 2022, 6:55 pm IST
ఉక్రెయిన్ లోని సుమీ నగరంలో బాంబులతో రష్యా సేనలు దాడులకు దిగాయి. ఈ దాడిలో ఇద్దరు పిల్లలు సహా 18 మంది మృతి చెందారు.
READ MORE
10:42 AM, 24 Feb
ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్
ఒడెస్సాలోకి వచ్చిన రష్యా బలగాలు... సరిహద్దు దాటి ఉక్రెయిన్లోకి ప్రవేశం: ఉక్రెయిన్ ప్రకటన
11:16 AM, 24 Feb
ఉక్రెయిన్ పై రష్యా చర్యను తప్పుబట్టిన యూకే ప్రధాని బోరిస్ జాన్సన్. తాను ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడినట్లు చెప్పిన జాన్సన్... పుతిన్ రక్తపాతమే కోరుకుంటున్నాడని తమ మిత్రదేశాలతో చర్చించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు బోరిస్ జాన్సన్
I am appalled by the horrific events in Ukraine and I have spoken to President Zelenskyy to discuss next steps.
President Putin has chosen a path of bloodshed and destruction by launching this unprovoked attack on Ukraine.
తూర్పు ఉక్రెయిన్లో రష్యా రెండు గ్రామాలను అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించిన ఉక్రెయిన్
1:02 PM, 24 Feb
ఉక్రెయిన్లో కేరళ విద్యార్థులు ఉన్నారు. అక్కడ యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వారిని క్షేమంగా భారత్కు తీసుకురావాలని కేంద్రప్రభుత్వాన్ని కోరాం. కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యలను వేగవంతం చేయాలని మరోమారు విజ్ఞప్తి చేశాం: కేరళ సీఎం పినరాయి విజయన్
There are reports that war has started in Ukraine. There are students from Kerala in Ukraine. We've already brought it to the notice of the Centre, it's taking action on it. We will ask the Centre to intensify its actions: Kerala CM Pinarayi Vijayan in state Assembly
ఉక్రెయిన్లో నివసిస్తున్న అమెరికా దేశీయులకు భద్రతాపరమైన ఆదేశాలు జారీ చేసిన అమెరికా ప్రభుత్వం.జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక. సురక్షితమైన ప్రాంతాలకు తరలివెళ్లాలంటూ సూచన
US embassy announces security alert for US nationals in #Ukraine following Russian President Putin declaring 'military operation' there. "US citizens in Ukraine are advised to shelter in place and take necessary action." pic.twitter.com/xoO4KKMxV7
రష్యా జరిపిన మిలటరీ చర్యల్లో భాగంగా ఆ నగర వీధుల్లో పడ్డ క్షిపణిని పరిశీలిస్తున్న ఉక్రెయిన్ పోలీసులు
Police officers inspect the remains of a missile that fell in the street, after Russian President Vladimir Putin authorized a military operation in eastern Ukraine, in Kyiv
రష్యా జరిపిన సైనిక చర్యల్లో ఉక్రెయిన్లో పెరుగుతున్న మరణాల సంఖ్య. ప్రస్తుతం ఏడుగరు మృతి
1:45 PM, 24 Feb
ఉక్రెయిన్లో ఉన్న భారతీయుల కోసం ఢిల్లీలో 24/7 కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసిన విదేశీ వ్యవహారాల శాఖ
MEA control room in Delhi being expanded and made operational on a 24x7 basis to assist the students and other Indian nationals in Ukraine, amid #RussiaUkraineConflictpic.twitter.com/zVDIlF9Gdh
యూరోపియన్ దేశాధినేతలకు ఆంక్షల జాబితాను నివేదిస్తాం. వారి ఆమోదం పొందాక రష్యాపై ఆర్థికపరమైన ఆంక్షలు విధిస్తాం: యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్
Later today, we'll present a package of massive & targeted sanctions to European leaders for their approval. With this, we'll target strategic sectors of Russian economy by blocking their access to key technologies & markets: European Commission President, Ursula von der Leyen pic.twitter.com/i57ERwJx8f