Russian Ukraine War: ఫేమస్ ఆసుపత్రి మీద బాంబులు వేసిన రష్యా, 330 మంది రోగుల్లో !
ఉక్రెయిన్: ఉక్రెయిన్ లోని పలు నగరాల్లో రష్యా వైమానిక దాడులు జరుపుతోంది. రష్యా వైమానిక దాడులు, సైనికుల దాడులతో ఉక్రెయిన్ జాతీయులతో పాటు ఆదేశంలో ఉంటున్న విదేశీయులు హడలిపోతున్నారు. ఉక్రెయిన్ ను వీలైనంత త్వరగా స్వాధీనం చేసుకోవాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్ ఆదేశాలతో ఆ దేశానికి చెందిన సైనికులు అరాచకాలు మొదలు పెట్టారు. యుద్ద విరామం ప్రకటించిన రష్యా ఆ హామీని తుంగలో తొక్కింది. యుద్ద విరామం ముసుగులో కూడా ఉక్రెయిన్ లో రష్యా బలగాలు దాడులు చేస్తూనే ఉంది. ఉక్రెయిన్- రష్యా యుద్దం నేపథ్యంలో ఉక్రెయిన్ లో ఉన్న విదేశీయులు ఇప్పుడు పొరుగు దేశాల్లో తలదాచుకోవడానికి పరుగు తీస్తున్నారు.
రోజురోజుకు రష్యా బలగాలు ఉక్రెయిన్ లోని నగరాలు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో విదేశీయులు ప్రాణభయంతో హడలిపోతున్నారు. శుక్రవారం రష్యా బలగాలు ఓ ప్రముఖ ఆసుపత్రి మీద బాంబుల వర్షం కురిపించడంతో అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని ఉక్రెయిన్ అధికారులు అంటున్నారు. 73 మందికి తీవ్రగాయాలై వేరే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు అంటున్నారు. అయితే రష్యా దాడుల్లో ఎంత మంది చనిపోయారు అనే విషయం ఉక్రెయిన్ అధికారులు బయటకు చెప్పడం లేదు.
Russian Ukraine War: లక్ష మందిని పంపించేశాము, చేసిన పాపం ఊరికేపోదు, జెలెన్ స్కీ ఫైర్ !
రష్యా వైమానిక దాడులు
ఉక్రెయిన్ లోని పలు నగరాల్లో రష్యా వైమానిక దాడులు జరుపుతోంది. రష్యా వైమానిక దాడులు, సైనికుల దాడులతో ఉక్రెయిన్ జాతీయులతో పాటు ఆదేశంలో ఉంటున్న విదేశీయులు హడలిపోతున్నారు. ఉక్రెయిన్ ను వీలైనంత త్వరగా స్వాధీనం చేసుకోవాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్ ఆదేశాలతో ఆ దేశానికి చెందిన సైనికులు అరాచకాలు మొదలు పెట్టారు.
యుద్ద విరామం అంటే ఇదేనా ?
యుద్ద విరామం ప్రకటించిన రష్యా ఆ హామీని తుంగలో తొక్కింది. యుద్ద విరామం ముసుగులో కూడా ఉక్రెయిన్ లో రష్యా బలగాలు దాడులు చేస్తూనే ఉంది. ఉక్రెయిన్- రష్యా యుద్దం నేపథ్యంలో ఉక్రెయిన్ లో ఉన్న విదేశీయులు ఇప్పుడు పొరుగు దేశాల్లో తలదాచుకోవడానికి పరుగు తీస్తున్నారు.
టార్గెట్ ఉక్రెయిన్ అధ్యక్షుడు ?
రోజురోజుకు రష్యా బలగాలు ఉక్రెయిన్ లోని నగరాలు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో విదేశీయులు ప్రాణభయంతో హడలిపోతున్నారు. ఉక్రెయిన దేశాన్ని మొత్తం స్వాధీనం చేసుకుని వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాల మేరకు ఆదేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ అంతు చూడాలని రష్యా సైనికులు బలంగా డిసైడ్ అయ్యారి ఉక్రెయిన్ అధికారులు ఆరోపిస్తున్నారు.
ప్రముఖ ఆసుపత్రి మీద రష్యా బాంబు దాడులు
శుక్రవారం రష్యా బలగాలు ఉక్రెయిన్ లోని ఇజీయం నగరంలోని మానసిక రోగుల చికిత్స పొందుతున్న ప్రముఖ ఆసుపత్రి మీద బాంబుల వర్షం కురిపించింది. రష్యా బాంబుల దాడిలో అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని ఉక్రెయిన్ అధికారులు అంటున్నారు. ఆసుపత్రిలో 330 మంది రోగులు చికిత్స పొందుతున్నారని, అందులో 73 మందికి తీవ్రగాయాలై వేరే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు అంటున్నారు. అయితే రష్యా దాడుల్లో ఆసుపత్రుల్లో ఎంత మంది చనిపోయారు అనే విషయం ఉక్రెయిన్ అధికారులు బయటకు చెప్పడం లేదు. రష్యా కాల్పుల విరమణ ఉల్లంఘిస్తోందని ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆరోపించారు.
దెబ్బకు దాటించేశారు
రష్యా దాడులతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంతో పాటు మరియుపోల్ నగరంలోని ప్రజలు ఆహారం, తాగడానికి నీళ్లు అందకపోవడంతో అలమటిస్తున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు రోజుల నుంచి మరియుపోల్ నగరంలోని లక్ష మంది సామాన్య ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చెప్పారు.