Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోడీకి ఫ్రాన్స్ టూర్ లో షాక్ ? మణిపూర్ హింసను ఖండిస్తూ యూరప్ పార్లమెంట్ తీర్మానం..

ప్రధాని మోడీ ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న వేళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత్ లోని ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో రెండు నెలలుగా సాగుతున్న హింసకు వ్యతిరేకంగా ఐరోపా దేశాలతో కూడిన యూరోపియన్ పార్లమెంట్ ఓ తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించింది. దీనిపై భారత్ స్పందించింది. అది తమ అంతర్గత విషయమని ఐరోపా దేశాలకు స్పష్టం చేసింది. అయినా భారత ప్రధాని తమ దేశాల్లో పర్యటిస్తున్న వేళ యూరోపియన్ పార్లమెంట్ వేసిన అడుగు కలకలం రేపింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్‌కు వెళ్తున్న నేపథ్యంలో యూరోపియన్ పార్లమెంట్ బుధవారం మణిపూర్ హింసపై ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో జరుగుతున్న ప్లీనరీ సెషన్‌లో మణిపూర్‌లో జాతి ఘర్షణలపై చర్చను మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన ఉల్లంఘన కేసుల అంశాన్ని పార్లమెంట్ అజెండాలో చేర్చారు. ఈ తీర్మానంలో పార్లమెంట్.. భారత్ మానవ హక్కులు, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని పిలుపునిచ్చింది.

setback to pm modi in France tour as European parliament passes resolution against manipur violence

మణిపూర్‌లో హింస, ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసాన్ని ఖండిస్తూ ఈయూ పార్లమెంటు తన తీర్మానంలో భారతీయ జనతా పార్టీలోని ప్రముఖ సభ్యులు ప్రవచిస్తున్న జాతీయవాద వాక్చాతుర్యాన్ని బలమైన పదాలలో ఖండిస్తున్నట్లు పేర్కొంది. అయితే భారత్ దీన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఈ సమస్య పూర్తిగా అంతర్గత విషయమని కేంద్రం తెలిపింది. ఈయూ పార్లమెంట్ మాత్రం భారత్ లోని పరిస్థితులపై తీవ్ర విమర్శలు చేస్తూ మైనారిటీలు, పౌర సమాజం, మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు క్రమం తప్పకుండా వేధింపులను ఎదుర్కొంటున్నారని ఆరోపించింది.

ముఖ్యంగా మహిళలు తీవ్రమైన సవాళ్లు, లైంగిక హింస , వేధింపులతో సహా గిరిజన, మతపరమైన నేపథ్యాల సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఈయూ పార్లమెంట్ తన తీర్మానంలో తెలిపింది. 2020 అక్టోబరులో మానవ హక్కుల కార్యకర్తల హక్కులను కాపాడాలని ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ భారతదేశానికి విజ్ఞప్తి చేశారని, పౌర సమాజానికి తమ ఆందోళన తెలిపే అవకాశం తగ్గింపోతోందంటూ మానవ హక్కుల సంస్థలు చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్నారని తీర్మానం తెలిపింది.

setback to pm modi in France tour as European parliament passes resolution against manipur violence

ఈయూ పార్లమెంట్ భారతదేశం, స్థానిక అధికారులను బాధితులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా మానవతాసాయం చేసేందుకు అనుమతించాలని, స్వతంత్ర పర్యవేక్షకులు దర్యాప్తును నిర్వహించాలని పిలుపునిచ్చింది.

రాజకీయ నాయకులు తిరిగి ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు, నిష్పక్షపాత పాత్ర పోషించడానికి ఉద్రేకపూరిత ప్రకటనలను నిలిపివేయాలని కోరింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం రెండింటి ద్వారా ఉద్రిక్తతలు, మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ప్రారంభించాలని సూచించింది.అలాగే వివాదాస్పద సాయుధ బలగాల చట్టాన్ని కూడా ఉపసంహరించుకోవాలని కోరింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+