మోడీకి ఫ్రాన్స్ టూర్ లో షాక్ ? మణిపూర్ హింసను ఖండిస్తూ యూరప్ పార్లమెంట్ తీర్మానం..
ప్రధాని మోడీ ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న వేళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత్ లోని ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో రెండు నెలలుగా సాగుతున్న హింసకు వ్యతిరేకంగా ఐరోపా దేశాలతో కూడిన యూరోపియన్ పార్లమెంట్ ఓ తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించింది. దీనిపై భారత్ స్పందించింది. అది తమ అంతర్గత విషయమని ఐరోపా దేశాలకు స్పష్టం చేసింది. అయినా భారత ప్రధాని తమ దేశాల్లో పర్యటిస్తున్న వేళ యూరోపియన్ పార్లమెంట్ వేసిన అడుగు కలకలం రేపింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్కు వెళ్తున్న నేపథ్యంలో యూరోపియన్ పార్లమెంట్ బుధవారం మణిపూర్ హింసపై ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఫ్రాన్స్లోని స్ట్రాస్బర్గ్లో జరుగుతున్న ప్లీనరీ సెషన్లో మణిపూర్లో జాతి ఘర్షణలపై చర్చను మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన ఉల్లంఘన కేసుల అంశాన్ని పార్లమెంట్ అజెండాలో చేర్చారు. ఈ తీర్మానంలో పార్లమెంట్.. భారత్ మానవ హక్కులు, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని పిలుపునిచ్చింది.

మణిపూర్లో హింస, ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసాన్ని ఖండిస్తూ ఈయూ పార్లమెంటు తన తీర్మానంలో భారతీయ జనతా పార్టీలోని ప్రముఖ సభ్యులు ప్రవచిస్తున్న జాతీయవాద వాక్చాతుర్యాన్ని బలమైన పదాలలో ఖండిస్తున్నట్లు పేర్కొంది. అయితే భారత్ దీన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఈ సమస్య పూర్తిగా అంతర్గత విషయమని కేంద్రం తెలిపింది. ఈయూ పార్లమెంట్ మాత్రం భారత్ లోని పరిస్థితులపై తీవ్ర విమర్శలు చేస్తూ మైనారిటీలు, పౌర సమాజం, మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు క్రమం తప్పకుండా వేధింపులను ఎదుర్కొంటున్నారని ఆరోపించింది.
ముఖ్యంగా మహిళలు తీవ్రమైన సవాళ్లు, లైంగిక హింస , వేధింపులతో సహా గిరిజన, మతపరమైన నేపథ్యాల సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఈయూ పార్లమెంట్ తన తీర్మానంలో తెలిపింది. 2020 అక్టోబరులో మానవ హక్కుల కార్యకర్తల హక్కులను కాపాడాలని ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ భారతదేశానికి విజ్ఞప్తి చేశారని, పౌర సమాజానికి తమ ఆందోళన తెలిపే అవకాశం తగ్గింపోతోందంటూ మానవ హక్కుల సంస్థలు చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్నారని తీర్మానం తెలిపింది.

ఈయూ పార్లమెంట్ భారతదేశం, స్థానిక అధికారులను బాధితులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా మానవతాసాయం చేసేందుకు అనుమతించాలని, స్వతంత్ర పర్యవేక్షకులు దర్యాప్తును నిర్వహించాలని పిలుపునిచ్చింది.
రాజకీయ నాయకులు తిరిగి ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు, నిష్పక్షపాత పాత్ర పోషించడానికి ఉద్రేకపూరిత ప్రకటనలను నిలిపివేయాలని కోరింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం రెండింటి ద్వారా ఉద్రిక్తతలు, మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ప్రారంభించాలని సూచించింది.అలాగే వివాదాస్పద సాయుధ బలగాల చట్టాన్ని కూడా ఉపసంహరించుకోవాలని కోరింది.
-
Noida jinx: అక్కడికి వెళ్తే పదవి పోయినట్లేనా ? సెంటిమెంట్ పై మోడీ కామెంట్స్..! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..!












Click it and Unblock the Notifications