వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీలంక ప్రెసిడెంట్ హత్యకు భారత్ 'రా' కుట్ర కథనం: అబద్దమని మోడీకి సిరిసేన ఫోన్

|
Google Oneindia TeluguNews

కొలంబో: శ్రీలంక అధ్యక్షులు మైత్రిపాల సిరిసేనను అంతం చేసేందుకు భారత నిఘా సంస్థ 'రా' పథకం పన్నుతోందని, ఈ విషయాన్ని సిరిసేననే స్వయంగా కేబినెట్ సమావేశంలో వెల్లడించారని ఓ పత్రికలో కథనం వచ్చింది. ఇది దుమారం రేపింది. ఈ విషయం ప్రధాని నరేంద్ర మోడీకి తెలియదని కూడా చెప్పారని పేర్కొన్నారు.

అయితే ఈ వార్తలను సిరిసేన సలహాదారు ఖండించారు. సిరిసేన మాటలను మీడియా వక్రీకరించిందన్నారు. దీనిపై అధ్యక్షుడి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడుతుందన్నారు. కొద్ది రోజుల్లో శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే, ప్రధాని మోడీ మధ్య న్యూఢిల్లీలో సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ ఆరోపణలు రావడం గమనార్హం.

Sri Lankan President telephones PM Modi to dispel reports of Delhis role in assassination

శ్రీలంక నేతలు భారత్ మీద ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2015లో మాజీ అధ్యక్షులు మహీంద్ర రాజపక్సే కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు. తాను అధికారం కోల్పోయి, మరో పార్టీ గద్దెనెక్కడం వెనుక 'రా' హస్తం ఉందన్నారు.

ఇదిలా ఉండగా, శ్రీలంక ప్రెసిడెంట్ సిరిసేన ప్రధాని మోడీకి బుధవారం ఫోన్ చేశారు. తన హత్యకు కుట్ర పన్నడంలో భారత్ పాత్ర ఉందంటూ తాను మాట్లాడలేదని చెప్పారు. అవన్నీ పూర్తి అవాస్తవాలు అన్నారు.

English summary
In a bid to repair New Delhi-Colombo relations, Sri Lankan President Maithripala Sirisena on Wednesday called up Prime Minister Narendra Modi saying the "malafide reports" in a section of press about him alleging an assassination attempt on his life by India's Research and Analysis Wing (RAW) were "utterly baseless and false".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X