సిరియా నుంచి సైన్యాన్ని వెనక్కి పిలిపించుకోండి.. లేదంటే: ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్: అంతర్గత కలహాలు, దాడులతో అల్లకల్లోలానికి గురైన సిరియాకు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిలిచారు. ఆ దేశ ప్రజల్ల నైతిక స్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. సిరియాలో దాదాపు యుద్ధం ముగిసినట్టేనని భావిస్తున్న ట్రంప్.. అక్కడున్న సైన్యాన్ని వెంటనే వెనక్కి పిలిపించుకోవాల్సిందిగా యూరోపియన్ దేశాలకు సూచించారు. సిరియాలో శాంతిని నెలకొల్పుతున్నామనే పేరుతో సైన్యం చేసిన ఆకృత్యాలపై విచారణ చేపట్టాలని కూడా ట్రంప్ ఆదేశించారు. లేకపోతే- తాను కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సైన్యాన్ని వెనక్కి పిలిపించుకోవాలని, లేకపోతే తన నిర్బంధంలో ఉన్న జిహాదీలను విడిచి పెట్టేలా చేయొద్దని అన్నారు.
భయానక ఉగ్రవాద సంస్థ ఐసిస్ తో అమెరికా సహా, యూరోపియన్ దేశాలకు సంబంధించిన సైనిక బలగాలు కొన్నేళ్లపాటు యుద్ధాన్ని కొనసాగించాయి. ప్రపంచవ్యాప్తంగా విస్తరించేలా కనిపించిన ఐసిస్.. ఈ యుద్ధంలో శక్తి విహీనమైంది. శాంతి బలగాలు చేసిన దాడుల్లో ఐసిస్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఐసిస్ ఆధీనంలో ఉన్న అనేక ప్రాంతాలు, పట్టణాలను కూడా శాంతి సైనిక బలగాలు తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నాయి. సిరియాలోని క్యాలిఫట్ అనే ఓ చిన్న ప్రాంతం మాత్రమే ఐసిస్ చేతిలో ఉంది. దీన్ని విడిపించడానికి సైనికులు తరచూ ఐసిస్ ఉగ్రవాదులపై దాడులు చేస్తున్నారు.

ఐసిస్ ఉగ్రవాదులు దాదాపు తమ శక్తి సామర్థ్యాలను, పలు ప్రాంతాలపై తమకున్న ప్రాబల్యాన్ని కోల్పోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని గత ఏడాది డిసెంబర్ లో అమెరికా తన సైన్యాన్ని సిరియా నుంచి వెనక్కి పిలిపించుకుంది. భారీ ఎత్తున సైన్యాన్ని మోహరింపజేయాల్సిన అవసరం లేదని భావించిన డొనాల్డ్ ట్రంప్.. తన సైన్యాన్ని ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం అక్కడ యూరోపియన్ దేశాలకు చెందిన సైనికులు సిరియాలో ఉంటున్నారు. సుమారు 800 మంది సైనికులు సిరియాలో ఉంటున్నారు. వారిని వెంటనే వెనక్కి పిలిపించుకోవాలని ట్రంప్ యూరోపియన్ యూనియన్ దేశాలకు సూచించారు. వారు చేసిన ఘాతుకాలపై విచారణ చేపట్టాలని కూడా ఆదేశించారు.

బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ..ఇతర యూరోపియన్ దేశాధినేతలను నేను ఒక్కటే కోరుతున్నా. 800 మంది ఐసిస్ వ్యతిరేక సైన్యాన్ని వెంటనే వెనక్కి పిలిపించండి. వారు చేసిన పనులపై విచారణ చేపట్టండి. క్యాలీఫట్ పై ఐసిస్ ఉగ్రవాదులు పట్టు కోల్పోతున్నారు.. అని ట్రంప్ అన్నారు. ఈ పరిస్థితుల్లో సైన్యం అక్కడ ఉండటం వల్ల ఉపయోగం లేదని, వెనక్కి పిలిపించి, విచారణ చేపట్టాలని సూచించారు. పనిలో పనిగా ట్రంప్.. ఐసిస్ ఉగ్రవాదులను కూడా హెచ్చరికలు జారీ చేశారు. మళ్లీ దాడులకు తెగబడటం, ప్రభుత్వ ఆధీనంలోని ప్రాంతాలను చేజిక్కించుకోవడం వంటి పనులకు దిగితే, సమీపంలో ఉన్న మిలటరీ బేస్ క్యాంపుల నుంచి దాడులు చేస్తామని అన్నారు. 2017 తరువాత ఐసిస్ క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. సైన్యం దాడులను తట్టుకోలేకపోయింది. తమ ఆధీనంలో ఉన్న మోసుల్, రక్కా వంటి ప్రాంతాలను కోల్పోయింది. ప్రస్తుతం క్యాలీఫట్ ప్రాంతంలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఐసిస్ తన ఆధీనంలో ఉంచుకుంది. దీన్ని విడిపించడానికి సైనికులు అక్కడ క్రమంగా దాడులు చేస్తున్నారు.
-
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం! -
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
H-1B వీసాదారులకు అమెరికా గుడ్ న్యూస్..! వేతనాల పెంపు ఇలా...! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
Bay of Pigs: క్యూబాలో అమెరికా ఎలా ఓడిపోయి లొంగిపోయింది ? నెక్ట్స్ ఇరానేనా ? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య..












Click it and Unblock the Notifications