ఎలిజిబెత్ 2 చనిపోయాక.. రాజుని: బ్రిటన్ను స్వాధీనం చేసుకంటానని నోటీసు
ఓ వ్యక్తి తనను తాను ఓ రాజ్యానికి రాజుగా ప్రకటించుకున్నాడు. కింగ్ డమ్ ఆఫ్ వేల్స్కు నేనే రాజును అని, తాను వేల్స్ రాజు వారసుడిని అని ప్రకటించుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు.
వేల్స్: ఓ వ్యక్తి తనను తాను ఓ రాజ్యానికి రాజుగా ప్రకటించుకున్నాడు. కింగ్ డమ్ ఆఫ్ వేల్స్కు నేనే రాజును అని, తాను వేల్స్ రాజు వారసుడిని అని ప్రకటించుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. మరీ ఆశ్చర్యమేమంటే.. అతను పత్రికలో అలా ప్రకటన ఇచ్చాడు.
అమెరికాలోని కొలొరడాకి చెందిన అలెన్ వి ఎవన్స్ తనని తాను మూడో శతాబ్దంలో వేల్స్ను పరిపాలించిన రాజుల వంశస్థుడని ఓ ప్రకటనలో చెప్పుకొచ్చాడు. కింగ్డమ్ ఆఫ్ వేల్స్ను స్థాపించిన కునెడ్డా లెడిగ్ వారసుడినని చెప్పాడు.

అప్పుడు ఆగిపోయిన వారి వంశస్థుల పరిపాలనను తను కొనసాగించాలని భావిస్తున్నాడట. ఇప్పుడు ఇంగ్లండ్ను తానే పరిపాలించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం పత్రికలో ప్రకటన ఇచ్చాడు.
బ్రిటన్ను స్వాధీనం చేసుకునేందుకు తన కుటుంబానికి, ప్రజలకు లీగల్ నోటీసులు కూడా ఇవ్వడం గమనార్హం. 30 రోజుల్లో వారి అభిప్రాయాలను తెలపాలని కోరాడు. ప్రస్తుతం బ్రిటన్ను పాలిస్తున్న ఎలిజిబెత్-2ను ఉన్నఫలంగా రాజ్యాన్ని తనకు అప్పగించాల్సిన అవసరం లేదని, ఎలిజిబెత్-2 చనిపోయిన తర్వాతే తాను రాజును అవుతానని అప్పటి వరకు వేచి ఉంటానని ప్రకటన ఇచ్చాడు.












Click it and Unblock the Notifications