270 మార్క్ చేరిన జో బిడెన్.. గెలుపు/ ఆధిక్యం.. కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతోంది. ఎముకలు కొరికే చలిలో హీట్ పుట్టిస్తోంది. అయితే డెమోక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ మార్క్ను ఆయన చేరుకున్నారని తెలుస్తోంది. 270 ఎలక్టోరల్ కాలేజీలను గెలుపు/ ఆధిక్యంలో ఉన్నారని సమాచారం. రిపబ్లిక్, సిట్టింగ్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం తానే లీడ్లో ఉన్నారని చెబుతున్నారు.
అట్టుడుకుతోన్న అమెరికా: వైట్హౌస్ దగ్గర కత్తిపోట్లు -అన్ని సిటీల్లో నిరసనలు -ఆజ్యంపోసిన ట్రంప్
అమెరికా ఈశాన్య రాష్ట్రాల్లో గల 3 ఎలక్టొరల్ కాలేజీలను బిడెన్ గెలుస్తారని సీఎన్ఎన్ అంచనా వేసింది. ఇక్కడ 4 ఎలక్టొరల్ ఓట్లు గెలిస్తే.. 2020 ఎన్నికల్లో 270 ఎలక్టొరల్ ఓట్లు సాధించడం తేలిక అవుతోంది. 2016లో హిల్లరీ క్లింటన్ మూడు ఎలక్టొరల్ ఓట్లను సాధించారు.
బిడెన్ అధిక ఓట్లను సాధించారు. గతంలో ఏ అభ్యర్థి కూడా ఇన్ని స్థానాలను గెలుచుకోలేదు. జో బిడెన్ 2008లో బరాక్ ఒబామా సాధించిన సీట్లను కూడా దాటిపోయాడు. నవంబర్ 4వ తేదీ ఉదయం 8 గంటల వరకు బిడెన్ స్పష్టమైన ఆధిక్యం కనిపించింది.