వ్యాక్సిన్ తీసుకున్నాక మైకం.. మీడియాతో మాట్లాడుతుండగా సొమ్మసిల్లి.. ఓ హెడ్ నర్స్
కరోనా వైరస్ వచ్చిన వారికి తీసుకుంటోన్న వ్యాక్సిన్ వల్ల ఒక్కొక్కరికీ ఒక్కో ప్రభావం చూపిస్తోంది. తలనొప్పి, అలసట, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. అయితే అమెరికాలో ఓ హెడ్ నర్స్ వ్యాక్సిన్ తీసుకున్నాక బ్రీఫింగ్ ఇస్తున్నారు. అంతకుముందే ఆమె టీకా తీసుకున్నారు. అయినా మూర్ఛపోయారు. దీంతో వ్యాక్సిన్ వల్ల కలిగే సమస్యలపై ఒకింత ఆందోళన నెలకొంది.
సొమ్మసిల్లిన హెడ్నర్స్
టిన్నెసీలో గల చాటనుగాలో టిఫానీ డొవర్ హెడ్నర్స్గా పనిచస్తున్నారు. సీహెచ్ఐ మెమోరియల్ హాస్పిటల్లో కరోనా వైరస్ కోసం తీసుకున్న వ్యాక్సిన్ గురించి వివరిస్తున్నారు. తన బృందం వ్యాక్సిన్ తీసుకుందని.. కలిగే ప్రయోజనాల గురించి వివరించేందుకు వచ్చారు. అయితే ఆ సమయంలోనే ఆమె సొమసిల్లి పడిపోయారు. పడిపోయేముందు తాను మైకంలో ఉన్నానని.. ఐ యామ్ సారీ అంటూ చెప్పారు. దీంతో చర్చానీయాంశమైంది.
లాస్ట్ స్టేజ్ ప్రయోగం..
వాస్తవానికి కరోనా వైరస్ టీకాల గురించి రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఒక్కొక్కరు ఒక్కో సమస్యను తెలియజేస్తున్నారు. ఇక్కడ మాత్రం వ్యాక్సిన్ గురించి చెబుతుండగా.. మూర్చ వచ్చినట్టు పడిపోవడం కలకలం రేపింది. మరోవైపు అన్నీ టీకాలు చివరి దశ ప్రయోగంలో ఉన్నాయి. 92 నుంచి 96 శాతం రోగ నిరోధక శక్తి కలిగి ఉంటుంది. ఏ ఒక్క వ్యాక్సిన్ కూడా 100 శాతం ప్రభావం చూపించడం లేదు.
జూన్ నుంచి తెరచే అవకాశం..
కరోనా వైరస్ వల్ల వ్యవస్థలు స్తంభించిపోయాయి. స్కూల్స్, కాలేజీల గురించి అయితే చెప్పక్కర్లేదు. కార్యాలయాలు కూడా అంతే.. జనవరి 1వ తేదీ నుంచి ఆఫీసులు తెరిచే అవకాశం ఉంది. వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో వస్తే మార్చి/ ఏప్రిల్ నుంచి ఆఫీసులు ఓపెన్ చేస్తారు. ఇక ఈ అకడమిక్ ఈయర్ కూడా ఆన్ లైన్ క్లాసులే జరుగుతాయి. జూన్ నుంచి పూర్తిస్తాయిలో క్లాసులు నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి.