Israel-Hamas War: ఇజ్రాయెల్, పాలస్తీనా అధ్యక్షులతో మాట్లాడిన జో బిడెన్..
ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాధినేతలతో దేశాధినేతలతో చర్చలు జరిపారు. ఇజ్రాయెల్, పాలస్తీనా నాయకులతో వేర్వేరు ఫోన్ లో మాట్లాడారు. పాలస్తీనా ప్రజలకు మానవతా సహాయం అవసరమని బిడెన్ నొక్కిచెప్పారు. సామాన్య పౌరులను రక్షించేందుకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. వారం క్రితం ఇజ్రాయెల్పై హమాస్ దాడి తర్వాత పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్తో బిడెన్ మాట్లాడారు. ఇలా చేస్తే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని చెప్పారు.
గాజాలోని పౌరులకు మానవతా సామాగ్రి చేరేలా చేసేందుకు ఐక్యరాజ్యసమితి, ఈజిప్ట్, జోర్డాన్, ఇజ్రాయెల్, ఇతరులతో కలిసి పనిచేయడానికి US చేస్తున్న ప్రయత్నాలపై బిడెన్ చర్చించారు. వివాదాన్ని విస్తరించకుండా నిరోధించాల్సిన అవసరాన్ని ఉందని ఇరు దేశాల అధ్యక్షుకలు బిడెన్ నొక్కిచెప్పారు. పౌరులందరికీ నీరు, ఆహారం, వైద్య సంరక్షణ అందుబాటులో ఉండేలా ఐక్యరాజ్యసమితి, ఈజిప్ట్, జోర్డాన్ ఈ ప్రాంతంలోని ఇతర దేశాలతో సమన్వయం గురించి ఆయన ఇరువురు నాయకులతో మాట్లాడారు.

ఇదిలా ఉండగా, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తన చైనా కౌంటర్ వాంగ్ యితో శనివారం మాట్లాడారు. "ఇజ్రాయెల్తో నిలబడటానికి, హమాస్ తీవ్రవాద దాడులను ఖండించడానికి పరిపాలన తీవ్రమైన దౌత్య కార్యక్రమాలలో భాగంగా, కార్యదర్శి తనను తాను రక్షించుకునే ఇజ్రాయెల్ హక్కు. హమాస్ దాడులను తక్షణమే నిలిపివేయాలని.. బందీలను విడుదల చేయాలని పిలుపునిచ్చారు" అని ఆంటోనీ బ్లింకెన్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కారణంగా వేల మంది ప్రాణాలు కోల్పోయారు.












Click it and Unblock the Notifications