సీజ్ ఫైర్ తర్వాత ఇరాన్ కు అమెరికా కీలక వార్నింగ్..! తోక జాడిస్తే జరిగేది ఇదే..!
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య సాగుతున్న యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు శుభం కార్డు వేసేశారు. తాజాగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలోకి అడుగుపెట్టి ఇరాన్ అణుస్ధావరాలపై బాంబులు వేసి ధ్వంసం చేసిన అమెరికా ఇప్పుడు తమ పని పూర్తయిందని ప్రకటించి సీజ్ ఫైర్ ప్రకటన చేసేసింది. దీంతో ఇజ్రాయెల్-ఇరాన్ కూడా తప్పని పరిస్ధితుల్లో కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు ప్రకటించాయి.
అయితే ఈ ప్రకటన తర్వాత అమెరికా ఉపాధ్యక్షుడు ఇరాన్ కు తాజాగా మరో హెచ్చరిక చేశారు. ఇరాన్ అణుస్ధావరాలపై తాము బాంబులు వేయడం వెనుక అణ్వస్త్రాల తయారీని అడ్డుకోవాలన్న ఉద్దేశం మాత్రమే ఉందన్నారు. ఇరాన్ కు అణ్వాయుధాలు అందకుండా చేయడమే తమ లక్ష్యమన్నారు. అయితే ఇజ్రాయెల్ తో కాల్పుల విరమణ తర్వాత మళ్లీ ఇరాన్ అణ్వాయుధాల తయారీకి ప్రయత్నిస్తే ఏం జరుగుతుందో జేడీ వాన్స్ చెప్పేశారు.

భవిష్యత్తులో ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయాలనుకుంటే బలమైన అమెరికా సైన్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హెచ్చరికలు జారీ చేశారు. తాము ఇరాన్ తో యుద్ధంలో లేమని, అయితే వారి అణ్వాయుధ కార్యక్రమంపై మాత్రం పోరాడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇరాన్ దగ్గర ఉన్న యురేనియాన్ని శిథిలాల కింద పాతేసినట్లు ఆయన వెల్లడించారు. అయితే దాని వివరాలు మాత్రం బయటపెట్టేందుకు నిరాకరించారు.
అమెరికా తాజాగా ఇరాన్ లోని మూడు అణు స్థావరాలైన ఫోర్డో, నతాంజ్, ఇస్పాహన్ పై భారీ బాంబులు వేసి ధ్వంసం చేసింది. అయితే అమెరికా దాడుల్లో ఇవి నిజంగానే ధ్వంసం అయ్యాయా, అక్కడ కార్యక్రమాలు తిరిగి ప్రారంభించే అవకాశం లేదా అన్న ప్రశ్నకు మాత్రం ఎవరివద్దా సరైన సమాచారం లేదు. ఈ నేపథ్యంలో తిరిగి ఆయా కేంద్రాల్లో ఇరాన్ అణుబాంబుల తయారీ చేపట్టవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో జేడీ వాన్స్ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అటు ఇజ్రాయెల్ కూడా ఇరాన్ అణుకార్యక్రమాన్ని తాము విజయవంతంగా అడ్డుకున్నట్లు చెప్పుకుంటోంది.
-
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
ఇరాన్ ఆర్మీ జనరల్ మృతి- కూలిన మరో మూలస్తంభం -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
ఖురాన్ శాంతి సందేశం.. రంజాన్ పవిత్రతకు యుద్ధ పరీక్ష -
ఇరాన్ వార్ ముగించేస్తాం..! అమెరికా మంత్రి సంచలన ప్రకటన..! -
అమెరికా F-35 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్.. ఎమర్జెన్సీ ల్యాండింగ్.. -
ఇరాన్ పై తప్పిన లెక్కలు-ట్రంప్ వన్నీ అబద్ధాలే-జో కెంట్ షాకింగ్..! -
అరటి పండుతో ఎన్నో ప్రయోజనాలు, వీరు మాత్రం దూరంగా ఉండాల్సిందే..!! -
చైనాకు బిగ్ షాక్.. భారత్కు రష్యా క్రూడాయిల్ షిప్పులు యూ టర్న్!! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి












Click it and Unblock the Notifications