Viral Video : ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న రెండు తలల పాము వీడియో
స్మార్ట్ ఫోన్లు,ఇంటర్నెట్ విస్తృతి పెరిగాక ఎక్కడ ఏ చిన్న ఆసక్తికర ఘటన జరిగినా క్షణాల్లో అవి సామాజిక మాద్యమాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. పక్షులు,అటవీ జంతువులు,సరీసృపాలకు సంబంధించిన వీడియోలైతే నెటిజన్లను ఇట్టే ఆకర్షిస్తుంటాయి. భయపెట్టే వీడియోలైనా సరే... నెటిజన్లు వాటి వైపు ఓ లుక్కేసి పోతుంటారు. తాజాగా ఇంటర్నెట్లో ఓ రెండు తలల పాము వీడియో వైరల్గా మారింది.
ఆ పాము ఒకేసారి రెండు చిట్టెలుకలను మింగేస్తుండటం ఈ వీడియోలో గమనించవచ్చు. చూడటానికి కాస్త భయంగొల్పేది ఉన్న ఈ వీడియోను అమెరికాకు చెందిన బ్రియా బ్రాక్జిక్ అనే కంటెంట్ క్రియేటర్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు. ఇప్పటివరకూ దీన్ని 18 వేల పైచిలుకు మంది వీక్షించారు. వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఆ రెండు తలల పాముకు ఒకే కడుపు ఉంటుందా అని ఓ నెటిజన్ ఫన్నీ కామెంట్ చేశాడు.

ఇండియాలోనూ రెండు తలల పాములు చాలానే కనిపిస్తుంటాయి. అయితే వాటిల్లో చాలా వాటికి ముందూ,వెనకా తల ఉంటుంది. ఇలా పక్కపక్కనే రెండు తలలు ఉండే పాములు ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. రెండు తలల పాములపై రకరకాల కట్టు కథలు,నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. సైన్స్ పరిభాషలో వీటిని బైసెఫాలిక్ లేదా డైసెఫాలిక్ అని పిలుస్తారు.ఈ పాముల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఔషధం ఉంటుందని,ఎయిడ్స్ను సైతం అది నయం చేయగలదని కొంతమంది నమ్ముతారు. కొంతమంది తాంత్రికులు ఈ పాములను అదృష్ఠ సూచకంగా చెబుతారు.
ఈ నేపథ్యంలోనే భారత్ సహా పలు దేశాల్లో వీటి అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోంది.భారత్లో ఈ పాములను పట్టుకోవడం చట్ట రీత్యా నేరం.బ్లాక్ మార్కెట్లో డబుల్ ఇంజన్గా పేర్కొనే ఈ తరహా పాములను రూ.3లక్షలు నుంచి రూ.10లక్షలు వరకు ధర పలుకుతోంది. అక్రమ రవాణా కారణంగా ఈ పాములు త్వరగా అంతరించిపోయే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications