బలమైన బంధం కోరుకుంటున్నాం: మోడీకి వైట్హౌజ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార యంత్రాంగం భారతదేశంతో బలమైన సంబంధాలను కోరుకుంటోందని అమెరికా అధికారిక భవనం వైట్హౌజ్ స్పష్టం చేసింది. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపరిచేందుకు .
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార యంత్రాంగం భారతదేశంతో బలమైన సంబంధాలను కోరుకుంటోందని అమెరికా అధికారిక భవనం వైట్హౌజ్ స్పష్టం చేసింది. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపరిచేందుకు ఇరు దేశాలు కృషి చేస్తాయని విశ్వసిస్తున్నామని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ మీడియా సమావేశంలో తెలిపారు.
గతంలో వెల్లడించినట్లే భారత ప్రధాని నరేంద్ర మోడీతోనూ, అమెరికా-భారత్ వ్యాపారాల్లోనూ సంబంధాలను మరింత బలపరిచే దిశగా కృషిచేస్తామని తెలిపారు.
తమ విదేశీ విధానాల పట్ల ముందుకెళ్తున్న క్రమంలో, భారత్తో సత్సంబంధాల కొనసాగింపు గురించి అధ్యక్షుడు ట్రంప్ తరచూ ప్రస్తావిస్తారని స్పైసర్ వెల్లడించారు.

కేన్సస్లో 32ఏళ్ల తెలుగు యువకుడు శ్రీనివాస్ హత్యను స్పైసర్ ఖండించారు. దేశ విలువలను కాపాడేందుకు అమెరికన్లంతా విధానాలకు కట్టుబడి కలిసి ఉండాలని ఆయన కోరారు. అమెరికన్లు ఇలాంటి విద్వేష ఘటనలకు తావివ్వకూడదని అన్నారు.
కొన్ని పాలసీలు మనల్ని విడదీసినప్పటికీ, మరికొన్ని పాలసీలు మనల్ని కలిపి ఉంచుతాయని స్పైసర్ అన్నారు. భారత్తో కలిసి ముందుకు సాగుతామని ట్రంప్ చాలాసార్లు చెప్పారని ఆయన గుర్తు చేశారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications