ఏఎస్సైపై దాడి: బీజేపీ శ్రేణులేనట, టీఆర్ఎస్ ఫైర్.. మాటల యుద్దం
హుజురాబాద్ ఉప ఎన్నిక చుట్టూ రాజకీయాలు సాగుతున్నాయి. మాజీమంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఇటు నేతలు కూడా బిజీ బిజీగా ఉన్నారు. ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నం అయ్యారు. సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నికల గురించి ఫోకస్ చేస్తున్నారు. తాజాగా బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులను కూడా నియమించారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందా అనే అనుమానం కలుగుతుంది. ఓడిపోతామనే భయంతో పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీజేపీ కార్యకర్తలు గుండాయిజం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఫైరయ్యారు. ఏకంగా దాడులకు పాల్పడుతూ.. భయానక వాతావరణం సృష్టిస్తున్నారు.
వీణవంక మండలం వల్లభాపూర్లో బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఈటల రాజేందర్ పర్యటన సందర్భంగా తన విధుల్లో భాగంగా ఫోటో తీసిన స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ బాపిరెడ్డిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తవా అంటూ ఏఎస్ఐపై దాడి చేసి ఆయన షర్ట్ను చింపేశారు. అంతటితో ఆగకుండా.. ఆయన బైక్ లో ఈటల అనుచరులు గాలి తీసి పైశాచిక ఆనందం పొందారు.

గత సాధారణ ఎన్నికల్లో హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజీనామా చేశారు. ఈటల రాజేందర్ రాజీనామాను స్పీకర్ కూడా ఆమోదించారు. దీంతో హుజురాబాద్లో ఎన్నికలు అనివార్యం అయ్యింది.
Recommended Video
ఇటు దళితులను ఆకట్టుకునేందుకు దళితబంధు పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎవరు గెలుస్తారు.. ప్రజలు ఎవరికీ పట్టం కడతారు?? బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేయనున్నారు. ఉప ఎన్నికల కారణంగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తున్నారు. ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేయగా.. హుజూరాబాద్ లో సభ అనంతరం ఈ ప్రాజెక్టు అమలు కోసం మొత్తం రూ. 2000 కోట్ల నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications