మహబూబ్‌నగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోయిలకొండలో కదల్లేని స్థితిలో చిరుతపులి కలకలం: బర్రెల ప్రతి దాడిలో గాయలు

|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్: జిల్లాలోని కోయిలకొండ మండలం బూర్గుపల్లిలో ఓ చిరుతపులి ప్రత్యక్షమవడం కలకలం సృష్టించింది. అయితే, దానికి రెండు కాళ్లకు గాయాలు ఉండటంతో అది నడవలేని స్థితిలో ఉండిపోయింది.

Recommended Video

Leopard Gels Up With People On Kullu Road || Oneindia Telugu

ఆ చిరుతను గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. కొందరు స్థానికులు ఆ చిరుతకు ఓ పాత్రలో నీరు అందించడంతో తాగింది. చిరుతను లేపేందుకు కొందరు గ్రామస్తులు ప్రయత్నించినా ఫలించలేదు.

 leopard with wounds appeared in mahabubnagar district.

సమాచారం అందండంతో చిరుత ఉన్న ప్రాంతానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు.. హైదరాబాద్ తరలించి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
కాగా, గ్రామంలోని ఓ పశువుల కొట్టంలోని బర్రెలపై దాడికి ప్రయత్నించిందని.. ఈ క్రమంలో బర్రెలు ఎదురుదాడి చేసి తొక్కడంతో గాయపడినట్లు స్థానికులు తెలిపారు.

చిరుతపులిని చూసేందుకు అక్కడికి భారీగా ప్రజలు చేరుకున్నారు. గత కొంతకాలంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పులులు సంచరిస్తున్న విషయం తెలిసిందే. అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉండటంతో పులులు గ్రామాల్లోకి అప్పుడప్పుడు వస్తున్నాయి.

English summary
leopard with wounds appeared in mahabubnagar district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X