కోయిలకొండలో కదల్లేని స్థితిలో చిరుతపులి కలకలం: బర్రెల ప్రతి దాడిలో గాయలు
మహబూబ్నగర్: జిల్లాలోని కోయిలకొండ మండలం బూర్గుపల్లిలో ఓ చిరుతపులి ప్రత్యక్షమవడం కలకలం సృష్టించింది. అయితే, దానికి రెండు కాళ్లకు గాయాలు ఉండటంతో అది నడవలేని స్థితిలో ఉండిపోయింది.
Recommended Video
ఆ చిరుతను గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. కొందరు స్థానికులు ఆ చిరుతకు ఓ పాత్రలో నీరు అందించడంతో తాగింది. చిరుతను లేపేందుకు కొందరు గ్రామస్తులు ప్రయత్నించినా ఫలించలేదు.
సమాచారం
అందండంతో
చిరుత
ఉన్న
ప్రాంతానికి
చేరుకున్న
అటవీశాఖ
అధికారులు..
హైదరాబాద్
తరలించి
చికిత్స
అందించేందుకు
ఏర్పాట్లు
చేశారు.
కాగా,
గ్రామంలోని
ఓ
పశువుల
కొట్టంలోని
బర్రెలపై
దాడికి
ప్రయత్నించిందని..
ఈ
క్రమంలో
బర్రెలు
ఎదురుదాడి
చేసి
తొక్కడంతో
గాయపడినట్లు
స్థానికులు
తెలిపారు.
చిరుతపులిని చూసేందుకు అక్కడికి భారీగా ప్రజలు చేరుకున్నారు. గత కొంతకాలంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పులులు సంచరిస్తున్న విషయం తెలిసిందే. అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉండటంతో పులులు గ్రామాల్లోకి అప్పుడప్పుడు వస్తున్నాయి.
A clash with a buffalo left a leopard badly injured in Mahabubnagar. Forest officials rescued the wild and shifted it for treatment. #Telangana pic.twitter.com/GxDr9ucdTH
— Aashish (@Ashi_IndiaToday) June 10, 2021