యాదాద్రి జిల్లాలో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. పైలట్ కు తీవ్రగాయాలు
యాదాద్రి : యాదాద్రి జిల్లాలో ఆర్మీ ట్రైనింగ్ విమానం కుప్పకూలింది. బాహుపేట శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన పైలట్ ప్యారాచూట్ సహాయంతో కిందకు దూకినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఆర్మీ అధికారులు వైద్య సిబ్బందిని ఘటనాస్థలికి పంపించారు. ఫస్ట్ ఎయిడ్ తర్వాత పైలట్ ను హైదరాబాద్ లోని మిలటరీ ఆసుపత్రికి తరలించారు. విమానం కూలిన ఘటనపై దర్యాప్తు చేపడుతున్నారు. సాంకేతిక కారణాలతో విమానం కూలినట్లు తెలుస్తోంది. ఖాళీ స్థలంలో విమానం కూలడంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.

సరిగ్గా వారం కిందట రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని మొఖిల గ్రామంలో ప్రైవేట్ శిక్షణ విమానం కూలింది. ఆ ఘటనలో కూడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. పైలట్ సురక్షితంగా బయటపడగా.. ట్రైనింగ్ పొందుతున్న భరత్ భూషణ్ అనే యువకుడికి స్వల్పగాయాలయ్యాయి.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications