ఆమె పైశాచికం .. ఆడాళ్ళను ట్రాప్ చేసి శృంగారం పేరుతో నరకం
పుట్టింది ఆడపుట్టుక అయినా ఆమెలో అన్ని మగ లక్షణాలు. గొంతుతో సహా అంతా మగాళ్ళ మాదిరి ఉంటుంది ఆమె తీరు. అలా అని పూర్తిగా హిజ్రాగా మారింది కూడా లేదు. కానీ ఈమె చేసిన దారుణాలు వింటే కచ్చితంగా అవుతారు. ఏపీలో ఒంగోలుకు చెందిన సుమలత అలియాస్ సాయి తేజ రెడ్డి ఆడవాళ్లను ట్రాప్ చేసి వారికి శృంగారం పేరుతో నరకం చూపిస్తోంది. తాజాగా ఆమె చేతిలో రెండు రోజులపాటు చిత్రవధ అనుభవించిన బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఆమె దారుణాలు సభ్య సమాజాన్ని షాక్ కి గురి చేస్తున్నాయి.

ఒంగోలుకు చెందిన సుమలతకు అమ్మాయిల పిచ్చి
ఒంగోలుకు చెందిన సుమలతకు అమ్మాయిల పిచ్చి. అమ్మాయిల ఫోన్ నంబర్లు సేకరించేది. గంభీరమైన మగవాళ్ళ గొంతులా ఉండే తన గొంతుతో చాలా తెలివిగా యువతులను ట్రాప్ చేస్తుంది సుమలత. సుమలత విసిరిన వలపు వలలో పడిన వారిని తన దగ్గరకు వచ్చేలా చేస్తుంది. ఇక ఆ యువతులతో శృంగారం చేయడం, సెక్స్ టాయ్స్ ఉపయోగించి పైశాచిక ఆనందం పొందడం చేస్తూ వారికి నరకం చూపించేది సుమలత. ఇక చాలాకాలంపాటు సుమలత చేస్తున్న ఈ వికృత చేష్టలు ఇలా కొనసాగుతూనే ఉన్నాయి.

స్పందనలో సుమలతపై ఫిర్యాదు చేసిన బాలిక
అయితే అనూహ్యంగా ఒంగోలులో నిర్వహించిన స్పందన కార్యక్రమం లో జిల్లా ఎస్పీ కి ఒక బాలిక ఫిర్యాదు చేయడంతో సుమలత బాగోతం బయటకు వచ్చింది. సుమలత అలియాస్ సాయితేజారెడ్డి చేతిలో రెండ్రోజులపాటు చిత్రవధ అనుభవించిన ఓ బాలిక తనపై జరిగిన దాష్టీకాన్ని ఎస్పీ దృష్టికి తీసుకు వెళ్ళింది. ఈనెల 2న సుమలత, ఏడుకొండలు చేసిన దారుణాన్ని ఆమె వివరించింది.

రెండురోజుల పాటు మత్తు మందిచ్చి సెక్స్ టాయ్స్ తో అత్యాచారం
ఆ బాలికను సుమలత రెండు రోజులపాటు తన ఇంట్లో మత్తుమందు ఇచ్చి, సెక్స్ టాయ్స్తో అత్యాచారం చేసిన విషయాన్ని బాలిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో తీగలాగితే డొంక కదిలింది. సుమలత చేసిన వికృత చేష్టలు, అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. తన పైశాచికానందం తీర్చుకోటానికి సుమలత చేస్తున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావనేది వారి దర్యాప్తులో తేలింది .

సుమలతకు సహకరించిన ప్రియుడు ఏడుకొండలు, వంశీలు
సుమలత స్వస్థలం ఒంగోలు జిల్లా కొండపి మండలం జాళ్లపాలెం గ్రామం . చాలా కాలం క్రితం ఆమె భర్తను వదిలేసి, భార్యను వదిలేసిన ఏడుకొండలు అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఇక మూడు నెలల క్రితం నుండి వీరిద్దరూ ఒంగోలు మారుతి నగర్ లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు.అక్కడ వారికి వంశి అనే సిమ్ కార్డులు విక్రయించే వ్యక్తితో పరిచయమైంది. ఇక వంశీ వద్దనుండి యువతల సెల్ ఫోన్ నెంబర్లు తీసుకొని సుమలత సాయితేజారెడ్డి పేరుతో మాట్లాడి వారిని ట్రాప్ చేసేది.

అమ్మాయిలపై ముగ్గురూ కలిసి అత్యాచారాలు.. పట్టుకున్న పోలీసులు
ఆ తర్వాత ఆ యువతులపై సుమలతతో పాటు, ఏడుకొండలు, వంశీ సైతం అత్యాచారం చేసి పైశాచిక ఆనందాన్ని పొందేవారు.పెళ్లికాని యువతులను,బాలికలను, కళాశాల విద్యార్థులను టార్గెట్ చేసి చాలా దారుణాలు చేసినట్లుగా పోలీసులు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఇక సుమలత ఇంట్లో సెక్స్ టాయ్స్ లభ్యం కావడంతో పోలీస్ కేసులో ఇరుక్కుంటున్నామని భయపడిన ఏడుకొండలు భవనంపై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సుమలతని, వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టుకు హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది.












Click it and Unblock the Notifications