సిద్దిపేటలో అపశృతి.. పిడుగుపాటుతో ఇద్దరు మృతి.. హరీశ్ రావు సాయం
సిద్ధిపేట : సిద్దిపేట జిల్లా కేంద్రంలో అపశృతి చోటు చేసుకుంది. పిడుగు పాటు కారణంగా ఇద్దరు మృత్యువాత పడ్డారు. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. చింతల చెరువు కట్టపై పిడుగు పడటంతో అక్కడే ఉన్న హనుమాన్ నగర్ వాస్తవ్యులు పస్తం శ్రీనివాస్, బాలరాజు అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
పిడుగుపాటుతో ఇద్దరు చనిపోయారని సమాచారం అందగానే మంత్రి హరీశ్ రావు దిగ్భ్రాంతికి గురయ్యారు. జరిగిన సంఘటన బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన హరీశ్ రావు.. రెండు కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

పిడుగుపాటు కారణంగా తీవ్ర గాయాల పాలైన చెన్నూరు సారయ్య ప్రభుత్వ వైద్య కళాశాలతో చికిత్స పొందుతున్నారు. ఆ మేరకు ఆయన్ని పరామర్శించారు హరీశ్ రావు. సారయ్యకు మెరుగైన చికిత్స అందించాలని అక్కడి వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ అవసరం అనుకుంటే హైదరాబాద్ తరలించి మంచి వైద్యం అందించాలని సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించొద్దని కోరారు.
-
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
తమిళనాడులో రిచ్ అభ్యర్థి ఈమెనే! ఎవరీ లీమా రోజ్ మార్టిన్? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
Assembly Poll Survey: బెంగాల్, అస్సాంలో గెలుపెవరిది ? షైనింగ్ ఇండియా తాజా సర్వే..! -
ఇరాన్ డెడ్ లైన్ పై ట్రంప్ మళ్లీ వెనక్కి ? అదే టర్నింగ్ పాయింట్..! -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది.. -
వేసవి సెలవులలో పిల్లలు ఆ పనిచేసే అవకాశం.. తల్లిదండ్రులు అలెర్ట్! -
Tamil Nadu Poll Survey: తమిళనాడులో షాకింగ్ ఫలితాలు-లోక్ పోల్ తుది సర్వేలో వారే క్లీన్ స్వీప్..! -
చందమామకు అవతలి వైపు అద్భుతం- సంపూర్ణ సూర్యగ్రహణం












Click it and Unblock the Notifications