ఘోరం: తండ్రి మరణం తట్టుకోలేక కుటుంబం ఆత్మహత్య(పిక్చర్స్)
హైదరాబాద్: నగర పరిధిలో పెను విషాద ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఇంటి యజమాని మృతి చెందితే, భర్త మరణాన్ని జీర్ణించుకోలేక భార్య, తీవ్ర దిగ్భ్రాంతికి గురై ఇద్దరు కుమార్తెలు, కుమారుడు క్షణికావేశంతో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
కుటుంబంలోని ఐదుగురూ మృతి చెందటంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన పారుపల్లి సత్యనారాయణ (55) అదిలాబాద్ జిల్లా అసిఫాబాద్లో హౌసింగ్ బోర్డు డిప్యూటీ ఇంజనీర్గా పని చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ రెండు నెలలుగా సిక్ లీవ్లో కొనసాగుతున్నారు.
సత్యనారాయణకు భార్య మీరా (50), కూతుర్లు స్వాతి (33), నీలిమ (29), కుమారుడు శివరామకృష్ణ (22)లు ఉన్నారు. అయితే, గత రెండు మూడేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పెద్ద కుమార్తెను హన్మకొండలోని అమ్మమ్మ వద్ద, చిన్న కూతురు, కొడుకును హైదరాబాద్లోని వసతి గృహంలో ఉంచి చదివిస్తున్నారు. వీరు ముగ్గురూ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.
కాగా, శుక్రవారం సాయంత్రం సత్యనారాయణ ఆరోగ్యం మరింత క్షీణించడంతో చికిత్స నిమిత్తం హైద్రాబాద్కు సొంత కారు (టిఎస్01 ఈఈ 6165)లో కుటుంబమంతా బయలు దేరారు. అప్పటికే రాత్రి కావడంతో భువనగిరి సమీపంలోని వివేరా హోటల్లో డిన్నర్ చేసి హైదరాబాద్కు బయలు దేరారు. బీబీనగర్ సమీపంలోకి రాగానే సత్యనారాయణ కారులోనే హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఎటూ పాలుపోని స్థితిలో భార్య మీరా, కూతుళ్లు స్వాతి, నీలిమ, కుమారుడు శివరామకృష్ణలు దిగ్భ్రాంతికి లోనయ్యారు.
తామెందుకు బతకాలంటూ వేదనకు గురయ్యారు. క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిపైవున్న అంకుషాపూర్ హెచ్పిసిఎల్ కంపెనీ వద్దకు రాగానే పక్కనే రైలు పట్టాలు కనిపించాయి. దీంతో మూకుమ్మడిగా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. రైలు పట్టాలకు సమీపంలో తమ కారును సత్యనారాయణ మృతదేహంతో పాటు నిలిపారు.
తల్లి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు కలిసి హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్లే రైలు మార్గంలోని పట్టాలపై పడుకున్నారు. రైలు వేగంగా రావడంతో నలుగురి తలలు, శరీర భాగాలు పట్టాలకు ఇరువైపుల వేర్వేరుగా పడ్డాయి. తల్లి మీరా, కూతురు స్వాతీల శరీర భాగాలు మాంసం ముద్దలుగా మారాయి. రాత్రి సమయంలో కారు రైలు పట్టాల సమీపంలో ఉండటంతో రాత్రి పూట గస్తీ తిరుగుతున్న పోలీసులు చూసి ఎవరో నిలిపి ఉంటారని వెళ్లి పోయారు.
శనివారం తెల్లవారు జామున మూడు గంటలకు పోలీసులు మరల చూసే సరికి కారు అక్కడే ఉంది. దీంతో అనుమానంతో పోలీసులు కారు వద్దకు వెళ్లి చూడగా.. కారులో మృతుడు సత్యనారాయణ మృతదేహం మాత్రమే ఉంది. దీంతో చుట్టు పక్కల వెతికి చూడగా ఎవరూ కనిపించక పోవటంతో రైలు పట్టాల వద్దకు వెళ్లి పరిశీలించారు. రైలు పట్టాలపై నాలుగు మృత దేహాలు పడి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
కారులో పరిశీలించగా వారికి సంబంధించిన వివరాలు, ఆధారాలు లభ్యం కావటంతో మృతుల బంధువులకు సమాచారం అందించారు. రైల్వే డిసిపి జగదీషప్ప, ఇన్స్పెక్టర్ అంజనేయులు, మల్కాజిగిరి డిసిపి రాంచంద్రారెడ్డి, ఏసిపి రవిచందన్రెడ్డి, ఘట్కేసర్ సిఐ ప్రకాష్లు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఒకే కుటుంబానికి చెందిన మొత్తం ఐదుగురు మృతి చెందడం అక్కడి వారిని కలిచివేసింది.

పెను విషాదం
హైదరాబాద్ నగర పరిధిలో పెను విషాద ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఇంటి యజమాని మృతి చెందితే, భర్త మరణాన్ని జీర్ణించుకోలేక భార్య, తీవ్ర దిగ్భ్రాంతికి గురై ఇద్దరు కుమార్తెలు, కుమారుడు క్షణికావేశంతో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

పెను విషాదం
శనివారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలోని ఐదుగురూ మృతి చెందటంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

పెను విషాదం
వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన పారుపల్లి సత్యనారాయణ (55) అదిలాబాద్ జిల్లా అసిఫాబాద్లో హౌసింగ్ బోర్డు డిప్యూటీ ఇంజనీర్గా పని చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ రెండు నెలలుగా సిక్ లీవ్లో కొనసాగుతున్నారు. సత్యనారాయణకు భార్య మీరా (50), కూతుర్లు స్వాతి (33), నీలిమ (29), కుమారుడు శివరామకృష్ణ (22)లు ఉన్నారు.

పెను విషాదం
శుక్రవారం సాయంత్రం సత్యనారాయణ ఆరోగ్యం మరింత క్షీణించడంతో చికిత్స నిమిత్తం హైద్రాబాద్కు సొంత కారు (టిఎస్01 ఈఈ 6165)లో బయలు దేరారు. అప్పటికే రాత్రి కావడంతో భువనగిరి సమీపంలోని వివేరా హోటల్లో డిన్నర్ చేసి హైదరాబాద్కు బయలు దేరారు.

పెను విషాదం
బీబీనగర్ సమీపంలోకి రాగానే సత్యనారాయణ కారులోనే హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఎటూ పాలుపోని స్థితిలో భార్య మీరా, కూతుళ్లు స్వాతి, నీలిమ, కుమారుడు శివరామకృష్ణలు దిగ్భ్రాంతికి లోనయ్యారు.

పెను విషాదం
తామెందుకు బతకాలంటూ వేదనకు గురయ్యారు. క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిపైవున్న అంకుషాపూర్ హెచ్పిసిఎల్ కంపెనీ వద్దకు రాగానే పక్కనే రైలు పట్టాలు కనిపించాయి. దీంతో మూకుమ్మడిగా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవాలని భావించారు.

పెను విషాదం
రైలు పట్టాలకు సమీపంలో తమ కారును సత్యనారాయణ మృతదేహంతో పాటు నిలిపారు. తల్లి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు కలిసి హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్లే రైలు మార్గంలోని పట్టాలపై పడుకున్నారు.

పెను విషాదం
రైలు వేగంగా రావడంతో నలుగురి తలలు, శరీర భాగాలు పట్టాలకు ఇరువైపుల వేర్వేరుగా పడ్డాయి. తల్లి మీరా, కూతురు స్వాతీల శరీర భాగాలు మాంసం ముద్దలుగా మారాయి.
-
Charminar Express: చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్-రూట్ మార్పు..! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్..












Click it and Unblock the Notifications