కిలోల కొద్దీ బంగారంతో పట్టుబడిన మహిళలు
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు మహిళలు కిలోల కొద్దీ బంగారంతో పట్టుబడ్డారు. కస్టమ్స్ అధికారులు గురువారం ఉదయం అక్రమంగా తీసుకువచ్చిన 7 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. ప్రయాణికుల తనీఖీల్లో భాగంగా సమీరా, సింథియా అనే ఇద్దరు మహిళల వద్ద నుంచి అధికారులు ఈ బంగారంను స్వాధీనం చేసుకున్నారు. మహిళలిద్దరూ దుబాయ్ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చారు.
దంపతుల దారుణహత్య
ఇదిలావుంటే, నిజామాబాద్ జిల్లా ఎడవల్లి మండలం జానకంపేటలో దంపతుల దారుణహత్య జరిగింది. కొందరు దుండగులు బండరాళ్లతో మోది దంపతులను హతమార్చారు. మృతుల వివరాలు, సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలంను పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

వడ్డీవ్యాపారి ఆగడాలు
హైదరాబాద్లోని పాతబస్తీలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితిమీరిపోయాయి. ట్రావెల్ ఏజెంట్ షరీఫ్ వడ్డీ వ్యాపారి నారాయణరెడ్డి వద్ద రూ. 10 వడ్డీ చొప్పున రూ. 4 లక్షలు తీసుకున్నాడు. సకాలంలో వడ్డీ చెల్లించలేదని వడ్డీ వ్యాపారి షరీఫ్ను కిడ్నాప్ చేశాడు. అనంతరం అల్మాన్గూడలో బంధించి చిత్రహింసలకు గురిచేశాడు.
కిడ్నాప్ విషయంపై షరీఫ్ బంధువులు పోలీసులను ఆశ్రయించారు. పిటిషన్ను స్వీకరించిన సంతోష్నగర్ పోలీసులు అల్మాన్గూడలో దాడులు చేసి షరీఫ్ను విడిపించారు. జరిగిన ఘటనతో పోలీసులు వడ్డీ వ్యాపారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
-
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
Silver షేక్ చేస్తుంది: 45 ఏళ్ల తర్వాత కమ్ముకున్న చీకట్లు. -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
Gold: భారీగా పెరిగిన బంగారం ధరలు. పసిడి మార్కెట్లో పూనకాలు -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications