వీణా-వాణీల శస్త్రచికిత్సకు ఆస్ట్రేలియా వైద్య బృందం సుముఖత
హైదరాబాద్: అవిభక్త కవలలు వీణా-వాణిలను పరిశీలించేందుకు ఆస్ట్రేలియా వైద్యుల బృందం శుక్రవారం హైదరాబాద్ వచ్చింది. వీణా-వాణి రిపోర్టులను అధ్యయనం చేసిన వైద్య బృందం ఆపరేషన్ చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది.
కాగా, ఆపరేషన్ కోసం ప్రభుత్వంతో వైద్య బృందం సంప్రదింపులు జరుపుతోంది. లండన్ వైద్యులు, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు గతంలో వైద్యం చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ.. అనంతరం వెనక్కి తగ్గారు.
ఆస్ట్రేలియా వైద్య బృందమైనా వీణావాణీలకు శస్త్ర చికిత్స చేసి విడిదీసి వారికి పునర్జన్మను ప్రసాదించాలని వీణావాణీల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ మేరకు వీణా-వాణిలకు ఆపరేషన్ చేయించాలని కోరుతూ తల్లిదండ్రులు ప్రభుత్వానికి లేఖ రాశారు.
మంత్రులను కలిసిన వైద్యుల బృందం
అవిభక్త కవలలు వీణా-వాణిలకు శస్త్ర చికిత్స నిర్వహించే విషయమై ఆస్ట్రేలియాలోని ప్రముఖ రాయల్ మెల్బోర్న్ చిల్డ్రన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ గురువారం మంత్రి ఈటల రాజేందర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యాక్షుడు నిరంజన్రెడ్డిలను మెల్బోర్న్ తెలంగాణ ఫోరం ప్రెసిడెంట్ రాజేశ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు శ్రీనివాస్ గొల్లపల్లి, సురేశ్ ఆకుల, పీఆర్వో ప్రవీణ్ కలిశారు.