పెళ్ళి చేసుకొంటానని చెప్పి మహిళపై అత్యాచారం, బాధితురాలిలా..
పెళ్ళి చేసుకొంటానని వివాహితకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసిన ఘటన హైద్రాబాద్ కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది.
హైదరాబాద్: పెళ్ళి చేసుకొంటానని వివాహితకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసిన ఘటన హైద్రాబాద్ కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది.
కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన యువతికి 2011లో వివాహమైంది. కుమారై పుట్టిన తర్వాత భర్తతో విడిపోయింది. అప్పటి నుండి పుట్టింట్లోనే ఉంటోంది. వారు అద్దెకు ఉంటున్న యజమాని లాడ్లీతో కలిసి పెళ్ళికోసం ఓ ఫంక్షన్ హాల్ కు వెళ్ళింది.
ఈ వివాహ ఫంక్షన్ లో బంధువైన మహిళ ద్వారా ఇమ్రాన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఒకరినొకరు ఫోన్ నెంబర్లు తీసుకొన్నారు. అప్పటి నుండి ఆమెకు ఫోన్ చేసి ప్రేమిస్తున్నానని ఇమ్రాన్ ఆమెకు చెప్పేవాడు.
అంతేకాదు పెళ్ళికూడ చేసుకొంటానని ఆమెను నమ్మించాడు. ఈ నెల 24వ, తేదిన ఆమెను అతడు బిర్యానీషా టేకిడి వద్దకు రావాలని కోరాడు.
అతడు చెప్పినట్టుగానే ఆమె అక్కడికి చేరుకొంది.దీంతో అతడు ఆమెను బైక్ పై నవాబ్ సాబ్ కుంట వద్దకు తీసుకెళ్ళాడు. అక్కడ ఓ మహిళ ఇంటికి తీసుకెళ్ళాడు.అయితే ఆ మహిళ వారిద్దరినీ ఇంట్లో ఒంటరిగా వదిలేసి బయటకు వెళ్ళింది.
అయితే ఇదే అదనుగా భావించిన ఇమ్రాన్ అమెపై అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పింది. బాధితురాలు కాలాపత్తర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.