మేడ్చల్లో పట్టపగలే వ్యక్తి దారుణ హత్య.. వీడియోలు తీశారు కానీ
హైదరాబాద్ నగర శివారు మేడ్చల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఓ వ్యక్తిని దారుణంగా ఇద్దరు దుండగులు కత్తులతో పొడిచిచంపారు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్లుగా తాపీగా అక్కడ్నుంచి జారుకున్నారు. పట్టపగలు జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఉమేష్ (25)ను ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఉమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత నిందితులు అక్కడ్నుంచి పరారయ్యారు. అయితే, దుండగులు హత్య చేస్తున్నప్పడు ఘటనా స్థలంలో చాలా మంది ఉన్నప్పటికీ వీడియోలు తీస్తూ ఉండిపోయారు కానీ.. నిందితులు అడ్డుకునే ప్రయత్నం మాత్రం చేయకపోవడం శోచనీయం.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ఎవరు? ఎందుకు ఉమేష్ ను చంపారనే విషయాలు తెలియాల్సి ఉంది. కాగా, ఉమేష్ మృతదేహాన్ని చూసి ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను వారు కోరారు.
A 25-year-old man, identified as Umesh, was brutally stabbed to death in the middle of the road in #Telangana's #Medchal on Sunday.
— Hate Detector 🔍 (@HateDetectors) February 16, 2025
The gruesome attack was carried out by two unidentified individuals.
Upon receiving the information, police rushed to the scene and began an… pic.twitter.com/FDvfk6ht1k
తమ్ముడే హంతకుడు
మేడ్చల్ బస్ డిపో ఎదురుగా జరిగిన హత్య కేసులో సంచలన విషయం వెలుగుచూసింది. సొంత తమ్ముడే సోదరుడు ఉమేష్ను మరో వ్యక్తి కలిసి హత్య చేసినట్లే తెలిసింది. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. ప్రతిరోజు మద్యం తాగుతూ కుటుంబసభ్యులను కొడుతున్నాడనే కోపంతోనే ఉమేష్ను అతని సోదరుడు హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య చేసిన అనంతరం నిందితులు పరారయ్యారని చెప్పారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications