నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరకట్నం కోసం కోడలిని 4రోజులపాటు నిర్బంధించిన అత్త

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని అంబర్‌పేట పటేల్‌నగర్‌లో వర్నకట్న వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. వరకట్నం కోసం ఓ అత్త తన కోడలిని నాలుగు రోజులుగా ఇంట్లోనే బంధించింది.

నిర్బంధంపై కోడలు ఎలాగోలా పోలీసులకు సమాచారం అందించింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని బాధితురాలికి విముక్తిని కల్పించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

A woman harassed her daughter-in-law for dowry

ఆర్టీసీ డ్రైవర్‌పై కత్తితో దాడి

నిజామాబాద్‌: జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్‌పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. నిజామాబాద్‌ నుంచి కామారెడ్డికి వెళ్తుండగా గన్నారం వద్ద బస్సు ఎక్కిన ఓ ప్రయాణికుడు డ్రైవర్‌ సిద్ధరామగౌడ్‌ పక్కన క్యాబిన్‌పై కూర్చునే ప్రయత్నం చేశాడు.

ఇందుకు డ్రైవర్‌ అంగీకరించకపోవడంతో తన వద్ద ఉన్న కత్తితో కడుపులో పొడిచాడు. ఈ సమయంలో బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించిన ప్రయాణికులపై కూడా దాడి చేసి పారిపోయాడు.

తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

English summary
A woman harassed her daughter-in-law for dowry in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X