వరకట్నం కోసం కోడలిని 4రోజులపాటు నిర్బంధించిన అత్త
హైదరాబాద్: నగరంలోని అంబర్పేట పటేల్నగర్లో వర్నకట్న వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. వరకట్నం కోసం ఓ అత్త తన కోడలిని నాలుగు రోజులుగా ఇంట్లోనే బంధించింది.
నిర్బంధంపై కోడలు ఎలాగోలా పోలీసులకు సమాచారం అందించింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని బాధితురాలికి విముక్తిని కల్పించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఆర్టీసీ డ్రైవర్పై కత్తితో దాడి
నిజామాబాద్: జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. నిజామాబాద్ నుంచి కామారెడ్డికి వెళ్తుండగా గన్నారం వద్ద బస్సు ఎక్కిన ఓ ప్రయాణికుడు డ్రైవర్ సిద్ధరామగౌడ్ పక్కన క్యాబిన్పై కూర్చునే ప్రయత్నం చేశాడు.
ఇందుకు డ్రైవర్ అంగీకరించకపోవడంతో తన వద్ద ఉన్న కత్తితో కడుపులో పొడిచాడు. ఈ సమయంలో బస్సు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించిన ప్రయాణికులపై కూడా దాడి చేసి పారిపోయాడు.
తీవ్రంగా గాయపడిన డ్రైవర్ను నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.