రామగుండం ఓపెన్కాస్ట్ గనిలో ప్రమాదం: మట్టి పెళ్లలు పడి ఇద్దరు మృతి
పెద్దపల్లి: రామగుండంలోని ఓపెన్ కాస్ట్ గనిలో బుధవారం ప్రమాదం చోటు చేసుకుంది. పైప్లైన్ లీకేజీని అరికట్టేందుకు నలుగురు కార్మికులు మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా మట్టి పెళ్లలు మీదపడ్డాయి. దీంతో మట్టిో కూరుకుపోయిన ఇద్దరు కార్మికులు ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలను గోదావరిఖని ఆస్పత్రికి తరలించారు. మృతులు ఫిట్టర్ వెంకటేశ్వర్లు, జనరల్ మజ్దూర్ విద్యాసాగర్గా గుర్తించారు. గాయపడిన మరో వ్యక్తికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

క్వారీ గుంతలో పడి ముగ్గురు మృతి
సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు(ఎస్) మండలం బొప్పారంలో విషాద ఘటన చోటు చేసుకుంది. క్వారీ గుంతలో పడి ముగ్గురు మృతి చెందారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. శ్రీపాల్ రెడ్డి, రాజు స్నేహితులు. శ్రీపాల్ రెడ్డి బిల్డర్ గా, రాజు సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తూ హైదరాబాద్లో నివాసముంటున్నారు.
కాగా, మంగళవారం వీరిద్దరూ ఓ విందు కార్యక్రమానికి తమ కుటుంబసభ్యులతో కలిసి బొప్పారం వచ్చారు. బుధవారం ఉదయం శ్రీపాల్ రెడ్డి, రాజు, ఆయన 12 ఏళ్ల కుమార్తె.. క్వారీ చూసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో రాజు కుమార్తె ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో పడిపోయింది. గంతలో నీరు ఉండటంతో ఆమెను కాపాడేందుకు రాజు, శ్రీపాల్ రెడ్డి అందులో దిగారు. ఈత రాకపోవడంతో ముగ్గురూ మృతి చెందారు. ముగ్గురి మృతితో వారి కుటుంబాలతోపాటు స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications