తొలి గెలుపు అక్బరుద్దీన్ ఓవైసీదే: అతి తక్కువ మెజార్టీతో కేసీఆర్, ఉత్తమ్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారు దూసుకెళ్తోంది. 80కి పైగా అసెంబ్లీ స్థానాల్లో ముందంజలో ఉంది. మహాకూటమి కేవలం 18 చోట్ల ముందంజలో ఉంది. అందులో కాంగ్రెస్ 17, టీడీపీ 1 స్థానంలో ముందంజలో ఉంది. బీజేపీ 4 స్థానాల్లో, మజ్లిస్ ఐదు స్థానాల్లో ముందంజలో ఉంది.
దాదాపు అన్ని జిల్లాల్లో తెరాసకు ఎదురు లేకుండా పోయింది. అదే సమయంలో పాతబస్తీలో బీజేపీ పాగా వేసే పరిస్థితి కనిపిస్తోంది. చార్మినార్, యాకుత్పురాల్లో బీజేపీ ముందంజలో ఉంది. సిద్దిపేటలో హరీష్ రావు దాదాపు 50వేల మెజార్టీతో ఉన్నారు. రికార్డ్ మెజార్టీ దిశగా సాగుతున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చింది. చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్ ఓవైసీ గెలుపొందారు. జగిత్యాలలో కాంగ్రెస్ ముఖ్యనేత జీవన్ రెడ్డి ఓటమి బాటలో ఉన్నారు. గజ్వెల్ నియోజకవర్గంలో కేసీఆర్ కేవలం 10వేల ఓట్ల మెజార్టీతో ఉన్నారు. వంటేరు ప్రతాప్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. ఇల్లందులో కోరం కనకయ్య 1500 ఓట్ల స్వల్ప మెజార్టీలో ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కేవలం 79 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications