అనుచిత వ్యాఖ్యలు: జగ్గారెడ్డిపై మరో కేసు నమోదు
సంగారెడ్డి: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై బుధవారం మరో కేసు నమోదైంది. సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
అక్టోబర్ 17న సంగారెడ్డి రోడ్షోలో అనుచిత వ్యాఖ్యలు చేశారని, అనుమతించిన సమయానికి మించి రోడ్షో నిర్వహించారంటూ జగ్గారెడ్డిపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పోలీసులు ఆయనపై ఐపీసీ 504, 506 సెక్షన్లు, టీఎస్ ఏరియా పోలీస్చట్టంలోని సెక్షన్ 26 కింద కేసు నమోదు చేశారు.

కుటుంబ సభ్యుల పేరిట ఇతరులను అక్రమంగా అమెరికాకు తీసుకెళ్లారన్న కేసులో ఇటీవల జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మానవ అక్రమరవాణా, పాస్పోర్టు దుర్వినియోగం, ప్రభుత్వ అధికారులను మోసం చేసిన కేసుల్లో పలు సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదయ్యాయి.
ఈ క్రమంలో జగ్గారెడ్డికి జైలు శిక్ష పడింది. ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన జగ్గారెడ్డి సంగారెడ్డిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాగా, టీఆర్ఎస్ పార్టీ తనపై కుట్రపూరితంగానే అక్రమ కేసులు పెడుతోందని జగ్గారెడ్డి ఆరోపిస్తున్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications