మరో గురుకుల విద్యార్థిని ఆత్మహత్య: ఏం జరుగుతోందని ప్రశ్నిస్తూ కవిత ఆవేదన
నల్గొండ: గత కొంతకాలంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా, సూర్యాపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో మరో బాలిక ఆత్యహత్య చేసుకుంది. పాఠశాలకు వెళ్దామన్న రోజునే ఆత్మహత్యకు పాల్పడటంతో అనుమానాస్పదంగా మారింది. కాగా, విద్యార్థుల ఆత్మహత్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కవిత ప్రభుత్వం పూర్తిస్థాయిలో విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇప్పించాలంటూ ట్విట్టర్ వేదికగా కోరారు.
సూర్యాపేట మండలం ఐమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థి అస్మిత (15) హైదరాబాద్లో ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతె మండలం బుర్కచర్ల గ్రామానికి చెందిన అస్మిత సూర్యాపేటలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో చదువుకుంటుంది. అయితే ఇటీవల వైష్ణవి మృతి నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం సెలవులు ప్రకటించింది.

ఈ క్రమంలో హైదరాబాద్లో ఉంటున్న తన తల్లి వద్దకు వెళ్లింది అస్మిత. శనివారం హాస్టల్కు తిరిగి వెళ్దామని తల్లి కుమార్తెతో చెప్పి పనికి వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చి చూడగా అప్పటికే ఫ్యాన్కు చున్నీతో ఉరి వేసుకుని బలవన్మరనానికి పాల్పడింది. దీంతో పాఠశాలకు వెళ్దాం అని చెప్పిన రోజే ఆత్మహత్య చేసుకోవడం అనుమానాస్పదంగా మారింది.
మృతదేహాన్ని బంధువులు స్వగ్రామమైన బుర్కచర్లకు తరలించారు. అక్కడ్నుంచి శవపరీక్ష చేసేందుకు సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, అదే గురుకులంలో గత వారం ఇంటర్ విద్యార్థి వైష్ణవి అనుమానాస్పద స్థితిలో ఆత్యహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, అస్మిత ఆత్మహత్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు.
గత కొద్ది కాలంలోనే ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అని కవిత విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ఏం జరుగుతోందని ప్రశ్నించారు. విద్యార్థులు ఎందుకు ఇలా వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నిలదీశారు. పూర్తి స్థాయి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేకపోవడం వల్ల ప్రభుత్వం ఇలాంటి సమస్యలపై దృష్టి సారించలేకపోతుందని ధ్వజమెత్తారు. తక్షణమే పూర్తి స్థాయి సంక్షేమ శాఖ మంత్రిని నియమించి, విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని కవిత ప్రభుత్వాన్ని కోరారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications