కాంగ్రెస్ వద్దు కమలమే ముద్దు: బీజేపీలో చేరనున్న మాజీ మంత్రి డీకే అరుణ..?
Recommended Video

హైదరాబాదు: ఎన్నికల వేళ తెలంగాణలో కాంగ్రెస్కు షాకులు మీద షాకులు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు. గతేడాది డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి గెలిచిన అభ్యర్థులు ఒక్కొక్కరుగా ఇతరపార్టీల్లో చేరుతున్నారు. ఇప్పటికే సగం మందికి పైగా కాంగ్రెస్ అభ్యర్థులు కాంగ్రెస్కు హ్యాండిచ్చి కారెక్కగా... మరికొందరు కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్కు చెందిన మరో బడా నాయకురాలు మాజీ మంత్రి డీకే అరుణ పార్టీ మారే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో తనకు సముచితమైన స్థానం కల్పించడం లేదన్న అసంతృప్తితో డీకే అరుణ ఉన్నట్లు సమాచారం.

కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఈమేరకు ఆమె బీజేపీ నేత రాంమాధవ్తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఉదయం రామ్మాధవ్ డీకే అరుణ నివాసానికి చేరుకుని చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. డీకే అరుణకు మహబూబ్నగర్ ఎంపీగా బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు 45 నిమిషాల పాటు రామ్మాధవ్తో చర్చలు జరిపిన డీకే అరుణ ఆ తర్వాత బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇక ఆమె రాజకీయ భవిష్యత్తుపై అమిత్ షా పూర్తి భరోసా ఇవ్వడంతో ఆ కాషాయ తీర్థం పుచ్చుకోవాలని డీకే అరుణ డిసైడ్ అన్నట్లు తెలుస్తోంది. ఇక చర్చలు సఫలం అవడంతో జాతీయ నేతలతో సమావేశం అయ్యేందుకు డీకే అరుణ ఢిల్లీ బయలు దేరి వెళ్లారు.
తెలంగాణలో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్గా ముద్ర వేసుకున్న డీకే అరుణ.. గతేడాది తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో గద్వాల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆమె తెలంగాణ పీసీసీ పదవిని ఆశించినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ హైకమాండ్ తనను పట్టించుకోకపోవడంతో ఆమె అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే నల్గొండ సీనియర్ నాయకులు మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు రఘువీర్ కూడా బీజేపీతో టచ్లోకి వచ్చినట్లు సమాచారం. ఆయన కూడా పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications