మేయర్తో భేటీ: వరంగల్ కార్యక్రమాలకు బంగ్లా ప్రతినిధులు ఫిదా
వరంగల్. వరంగల్ నగర మేయర్ బంగ్లాదేశ్ లోని పలు నగరాల మేయర్లు, కమీషనర్లు సమావేశమయ్యారు. దశలవారీగా చెత్తను ప్రక్షాళన చేసే కార్యక్రమంలో వరంగల్ కార్పోరేషన్ ప్రపంచస్థాయి గుర్తింపు పొందింది.
వరంగల్ కార్పోరేషన్ చైర్మెన్ తో బంగ్లాదేశ్ కు చెందిన పలువురెు మేయర్లు, కమీషనర్లు సమావేశమయ్యారు. వరంగల్ నగరంలో ఏ రకంగా చెత్త సేకరణకు సంబందించి చర్యలు తీసుకొంటున్నారనే దానిపై వివరాలు సేకరించారు.
బహిరంగ మల , మూత్ర విసర్జన స్కూల్ శానిటేషన్ తదితర అంశాలపై మేయర్ , ఆస్కీ ప్రతినిధులు బంగ్లాదేశ్ ప్రతినిధులకు వివరించారు.స్థానికంగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేపట్టాలని ఆయన బంగ్లాదేశ్ ప్రతినిధులకు వివరించారు.పర్యాటక, సాంస్కృతిక రంగాల్లో అభివృద్ది చెందుతున్న నగరాల్లో వరంగల్ ఒకటన్నారు మేయర్.

నగరం నుండి వెలువడిన చెత్తను సేకరించి...వాటి నుండి ఘన వ్యర్థాలను వేరు చేసేందుకు 200 ఎకరాల స్థలాన్ని సేకరించినట్టు చెప్పారు.వరంగల్ నగరంలోని పాఠశాలల్లో హాండ్ వాష్ , టాయిలెట్లు, ఈ టాయిలెట్లు, వ్యర్థాల విభజన, వాహానాల మొబైల్ టెక్నాలజీ తదితర అంశాల పట్ల బంగ్లాదేశ్ ప్రతినిధులు వరంగల్ కార్పోరేషన్ చేస్తోన్న కృషిని ప్రశంసించారు.ఒడిఎఫ్ తదితర అంశాలను అధ్యయనం చేసేందుకు జిడబ్ల్యుఎంసి ప్రజా ప్రతినిధులు అధికారులు బంగ్లాదేశ్ లో పర్యటించాలని కోరారు. ఈ మేరకు వరంగల్ మేయర్ కూడ సానుకూలంగా స్పందించారు.
చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తికి తీసుకోవాల్సిన చర్యలపై కూడ భవిష్యత్ లో చర్యలు తీసుకొనే అవకాశం ఉందని పాలకవర్గ సభ్యులు తెలిపారు. బంగ్లాదేశ్ నుండి వచ్చిన ప్రతినిధులను వరంగల్ మేయర్ ఘనంగా సన్మానించారు.












Click it and Unblock the Notifications