వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలుడ్ని కిడ్నాప్ చేసి అమ్మేశాడు: బీ ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బాలుడి కిడ్నాప్ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదులోని నెక్లెస్‌రోడ్‌లో కిడ్నాపర్ బాలాచారిని పోలీసులు పట్టుకున్నారు. బాలుడిని అమ్మేసినట్లు బాలాచారి పోలీసుల విచారణలో వెల్లడించాడు. సికింద్రాబాద్ జనరల్ బజార్‌లో నిన్న 14 నెలల బాలుడు పృథ్వి కిడ్నాప్‌కు గురయ్యాడు.

బాలుడి కిడ్నాప్‌పై మహంకాళి పోలీస్‌స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. బాలుడిని తమ బంధువు బాలాచారి అపహరించినట్లు ఆరోపించారు. ఘటనా స్థలంలోని సీసీ టీవీ పుటేజీలను పరిశీలించిన పోలీసులు బాలాచారి కిడ్నాప్‌కు పాల్పడినట్లు నిర్ధారించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

Boy Prithvi kidnapped and sold

ఇదిలావుంటే, సికింద్రాబాదులోని బోరబండ వద్ద రైలు కిందపడి బీ పార్మసీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతుడు భార్గవ్‌నాయుడుగా గుర్తించారు.

కుత్బుల్లాపూర్‌లో ఉండి కండ్లకోయలోని కళాశాలలో భార్గవ్ ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం. భార్గవ్ ఆత్మహత్యపై కళాశాల వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్, కళాశాల యాజమాన్యం వేధింపులే కారణమంటూ ఆరోపిస్తున్నారు.

English summary
A boy Prithvi kidnapped and sold by a man Balachari in Hyderabad of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X