పైసలిస్తేనే పాస్ చేస్తాం!
హైదరాబాద్ : ఆయన ఓ యూనివర్సిటీ హెచ్ఓడీ. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత ఆయనది. అయితే డబ్బుల కోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకునేందుకు సిద్ధమయ్యాడు. పైసలిస్తేనే పాస్ చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో తొలుత భయపడ్డ విద్యార్థులు ఆ తర్వాత మాస్టర్ ప్లాన్ వేశారు. పక్కా ఆధారాలతో ఆ హెచ్ఓడీని ఏసీబీకి పట్టించారు. దీంతో సదరు గురువుగారు ప్రస్తుతం కటకటాలు లెక్కపెడుతున్నాడు.

ఏసీబీకి పట్టుబడ్డ ఉస్మానియో హెచ్ఓడీ
విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసి డబ్బు సంపాదించాలని ఉస్మానియా మెడికల్ కాలేజ్ హెచ్ఓడీ భుక్యా బాలాజీ వేసిన ప్లాన్ బెడిసి కొట్టింది. క్వశ్చన్ పేపర్ కఠినంగా ఉంటుందని, ఫెయిల్ అవడం ఖాయమని విద్యార్థుల్ని భయపెట్టిన ఆయన ఎగ్జామ్లో పాస్ చేసేందుకు డబ్బు డిమాండ్ చేసేవాడు. స్టూడెంట్స్ ఫిర్యాదుతో ఈ నెల 4న ఏసీబీ అధికారులు బాలాజీ, అతకి సహకరించిన ఆర్ శ్రీనును అరెస్ట్ చేశారు. బాలాజీ ఆగడాలకు సంబంధించి సాక్ష్యాధారాలు ఉంటే వాట్సాప్ ద్వారా అందించాలంటూ ఓ మొబైల్ నెంబర్ విడుదల చేశారు.

వాట్సప్కు వీడియోలు పంపిన విద్యార్థులు
ఏసీబీ వాట్సాప్ ప్రకటనపై పీజీతో పాటు యూజీ విద్యార్థులు స్పందించారు. భుక్యా బాలాజీ తమ వద్ద నుంచి డబ్బు తీసుకుంటున్న వీడియోలను వాట్సప్లో ఏసీబీకి పంపారు. వాటి ఆధారంగా బాలాజీ నేరాన్ని నిర్థారించుకున్న ఏసీబీ అధికారులు అందుకు సహకరించిన కాలేజ్ జూనియర్ అసిస్టెంట్ ఖాజా అహ్మదుద్దీన్ను అరెస్ట్ చేశారు. ఇప్పటికే కటకటాలు లెక్కబెడుతున్న బాలాజీపై మరో కేసు బుక్ చేశారు.

రూ.10వేల నుంచి 20వేలు వసూలు
ఎగ్జామ్స్లో ఫెయిల్ చేస్తానని భయపెట్టిన భుక్యా బాలాజీ ఒక్కో స్టూడెంట్ నుంచి రూ.10 వేల నుంచి 20వేల వరకు వసూలు చేసినట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఇలా గతేడాది మేలో జరిగిన పరీక్షల్లో స్టూడెంట్స్ నుంచి రూ.1.60లక్షలు, ఈ ఏడాది మార్చి ఎగ్జామ్స్ సమయంలో రూ.1.50లక్షలు వసూలు చేశాడని అంటున్నారు. భుక్యా బాలాజీ వ్యవహారం వెలుగులోకి రావడంతో మెడికల్ కాలేజీ, హాస్పిటల్ ఫ్యాకల్టీ, ఇతర ఉద్యోగులు డబ్బు డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని వారిపై చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.
-
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు












Click it and Unblock the Notifications