తెలంగాణా రైతులకు సంక్రాంతికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కేంద్రం!
నిజామాబాద్ ప్రజల చిరకాల కోరిక తీర్చి తెలంగాణ రైతాంగానికి కేంద్రం శుభవార్త చెప్పింది. సంక్రాంతి సందర్భంగా పసుపు బోర్డును ప్రారంభించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిజామాబాద్ లో పసుపు బోర్డును ఏర్పాటు చేసింది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పసుపు బోర్డును ప్రారంభించారు.
ఏర్పాటైన పసుపు బోర్డు
ఈ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. అలాగే కేంద్రమంత్రి బండి సంజయ్ కరీంనగర్ లోని తన కార్యాలయం నుంచి వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ధర్మపురి అరవింద్ చేసిన కృషిని కొనియాడారు.

ఎన్నికల ముందు హామీ ఇచ్చిన పసుపు బోర్డు
ఎంపీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారం చేశారు. 2023 అక్టోబర్ 1వ తేదీన మహబూబ్ నగర్ సభలో ప్రధాని మోదీ కూడా ఈ విషయాన్ని ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబర్ 4వ తేదీన కేంద్ర వాణిజ్య శాఖ దీనిపైన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
మాట నిలబెట్టుకున్న ధర్మపురి అరవింద్
తాజాగా నిజామాబాద్ లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ఈరోజు కేంద్రమంత్రి ప్రకటించి పసుపు బోర్డ్ చైర్మన్ గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన బిజెపి నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమించారు. గతంలో ఎన్నికలకు ముందు పసుపు బోర్డు ఏర్పాటుపైన స్టాంపు పేపర్ మీద రాసిచ్చిన ధర్మపురి అరవింద్ ఎట్టకేలకు తాను అన్న మాటను నెగ్గించుకున్నారు.
आज National Turmeric Board के उद्घाटन कार्यक्रम को संबोधित किया।
— Piyush Goyal (@PiyushGoyal) January 14, 2025
प्रधानमंत्री @NarendraModi जी के नेतृत्व में हम हल्दी के प्रति जागरूकता फैलाने, निर्यात को प्रोत्साहित करने और इस क्षेत्र से जुड़े किसानों की आमदनी बढ़ाने के लिए प्रतिबद्ध हैं। pic.twitter.com/Gj4mURzEIy
రైతాంగానికి అసలైన పండుగ రోజు
నిజామాబాద్ లో పసుపు బోర్డును ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం బిజెపికి నిజామాబాద్ లో మంచి బూస్ట్ వచ్చినట్లుగా పరిస్థితి మారింది. బీజేపీ ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్టు ఏర్పాటు చేయడంతో, సంక్రాంతి పండుగ రోజు పసుపు బోర్డు ఏర్పాటు కావడంతో, ఈ సంక్రాంతి నిజంగా రైతాంగానికి అసలైన పండుగ రోజు అని నిజామాబాద్ వాసులు భావిస్తున్నారు నిజామాబాద్ లో ఏర్పడిన పసుపు బోర్డుతో రైతులకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది. ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ కల నేడు నెరవేరినందుకు నిజామాబాద్ వాసులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications