హైదరాబాద్ జూపార్క్ లో ఆ జంతువు..! ఒకేరోజు 23 వేల మంది సందర్శన..!
హైదరాబాద్ లోని నెహ్రూ జూపార్క్ ను ఒకేరోజు 23 వేల మంది సందర్శించారు. డిసెంబర్ 25 క్రిస్మస్ సెలవులు కారణంగా ఒకే రోజు జూపార్క్ కు 23,440 మంది పర్యటకులు సందర్శించినట్లు జూపార్క్ అధికారులు పేర్కొన్నారు. సాధారణంగా వేసవి సెలవుల్లో ఇలా అధిక సంఖ్యలో పర్యటకులు వస్తుంటారు. కానీ ఈ సారి క్రిస్మస్ సెలవుల్లో ఈ రికార్డును అధిగమించడం శుభ పరిణామం అని అధికారులు స్పష్టం చేశారు.
పర్యటకుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జూ సిబ్బందిని అధిక సంఖ్యలో మోహరించారు. తాగునీటి సదుపాయాలను విస్తరించారు. జూపార్క్ లోని ఒక్కో విభాగం వద్ద సెక్యూరిటీ గార్డులను మోహరించి పర్యటకులను దిశా నిర్దేశం ఇస్తున్నారు. ఈ వీకెండ్ లో మరింత మంది పర్యటకులు జూపార్క్ ను సందర్శించే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఇందుకు తగిన ఏర్పాట్లను చేస్తున్నట్లు వివరించారు.
జూపార్క్ లో ఇటీవల అనేక కొత్త జంతువులు, పక్షులను సంరక్షణ కోసం తీసుకొచ్చారని అందువల్ల టూరిస్టుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని నెహ్రూ జూపార్క్ అధికారి జే. వసంత తెలిపారు. కొత్తగా జీబ్రా, మీర్కట్, సెర్వల్ క్యాట్, బారాసింగా, వైట్ స్వాన్స్.. అలాగే ఇతర పక్షులు, పాములను ఇటీవల ఇతర జూ పార్కుల నుంచి తరలించినట్లు వివరించారు. కొత్తగా వచ్చిన జంతువులను చూసేందుకు పర్యటకులు అధిక సంఖ్యలో వచ్చినట్లు తెలిపారు.

ప్రస్తుతం నెహ్రూ జాపార్క్ లో 199 రకాల క్రూర జంతువులు ఉన్నాయి. పలు దేశాల నుంచి ఈ జంతువులను ఇక్కడికి తరలించారు. మరోవైపు గుజరాత్ లోని జామ్ నగర్ లో రిలయన్స్ ఫౌండేషన్ కు చెందిన అంతర్జాతీయ వన్యప్రాణుల రక్షణ, పరిరక్షణ కేంద్రమైన వంతారా నుండి అరుదైన జంతువులు త్వరలోనే హైదరాబాద్ జూపార్క్ కు రానున్నాయి. ఇక్కడి నుంచి ఒక జత కంగారూలను తీసుకురానున్నారు. వీటి కోసం ఎన్ క్లోజర్లు.. అలాగే రాత్రిపూట నివాస గృహాలను సైతం ఇప్పటికే సిద్ధం చేసినట్లు జూ అధికారులు పేర్కొన్నారు. ఇక ఎక్స్ ఛేంజ్ లో భాగంగా కంగారూలకు బదులు హైదరాబాద్ జూ నుంచి ఒక ఏనుగును వంతారాకు పంపనుంది.
ఇక హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ మీర్ ఆలం ట్యాంక్ సమీపంలో బహదూర్ పురాలో ఉంది. ఈ పార్కు దాదాపు 380 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ జూపార్కును ప్రతి సోమవారం మూసివేస్తారు. మిగతా రోజుల్లో ఉదయం 8:30 నుంచి సాయంత్రం 4:00 వరకు తెరిచి ఉంటుంది. టికెట్ ఫీజు విషయానికి వస్తే.. ప్రస్తుతం పెద్దలకు (12 సంవత్సరాల కంటే ఎక్కువ) రూ. 100 ఉంది. అలాగే పిల్లలకు (3-12 సంవత్సరాలు) రూ. 50 గా ఉంది.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications