మేక్ ఏ విష్ ఫౌండేషన్: ఒకరోజు రాచకొండ పోలీస్ కమిషనర్గా ఆరేళ్ల బాలుడు
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని రాచకొండ పోలీస్ కమిషనర్గా ఒకరోజు పాటు డి ఇషాన్ అనే బాలుడు ఉన్నారు. ఆ బాలుడి వయస్సు ఆరేళ్లు. అతను రెండో తరగతి చదువుతున్నాడు. మెదక్ జిల్లాకు చెందిన వాడు.

అతను బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. మేక్ ఏ విష్ ఫౌండేషన్ అతని కోరిక తెలుసుకొని పోలీసులను సంప్రదించింది. దీంతో ఆ బాలుడు ఒకరోజు పాటు రాచకొండ పోలీస్ కమిషనర్గా పని చేశారు.

మేక్ ఏ విష్ ఫౌండేషన్ గతంలో ఇలాంటివి ఎన్నో చేపట్టింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను కలిసేందుకు శ్రీజ ఆసక్తి చూపించడంతో అందుకు ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ను కూడా ఓ బాలుడు కలిశారు.












Click it and Unblock the Notifications