మేడిగడ్డ వద్ద బ్యారేజీ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. తన పర్యటనలో ఆయన మేడిగడ్డ బ్యారేజ్ పనులను పరిశీలించారు.
సీఎం కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజ్ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి కన్నెపల్లి పంప్ హౌజ్ వద్దకు చేరుకుని పనులను పరిశీలించారు.

ఆ తర్వాత అన్నారం బ్యారేజీ వద్ద రెండో ఆనకట్ట పనులను పరిశీలించారు. కేసీఆర్ వెంట మంత్రులు హరీశ్ రావు, ఈటెల రాజేందర్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీలు వినోద్, బాల్క సుమన్ తదితరులు ఉన్నారు.












Click it and Unblock the Notifications