తేల్చేసిన హైమాండ్, రేవంత్ కు బిగ్ టాస్క్ - మంత్రులకు పరీక్ష..!!
తెలంగాణ కేంద్రంగా రాజకీయ ఆసక్తి కరంగా మారింది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల వేళ రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మీడియా సంస్థల కేంద్రంగా మంత్రులు లక్ష్యంగా చోటు చేసుకుంటున్న పరిణామాల పై రేవంత్ సీరియస్ అయ్యారు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రాజకీయంగా బిగ్ టాస్క్ ఎదుర్కొనేందుకు సిద్దమయ్యారు. ఇందులో మంత్రులను భాగస్వాములను చేస్తున్నారు. మంత్రుల సమర్థతకు పరీక్ష పెడుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పరీక్ష మంత్రుల రాజకీయ భవిష్యత్ కు కీలకంగా మారుతోంది.
ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా జరిగిన మంత్రివర్గ భేటీ రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు నిర్ణయించారు. ఫిబ్రవరిలో ఈ ఎన్నికలు జరపాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలోని 116 మునిసిపాలిటీలు, ఏడు మునిసిపల్ కార్పొరేషన్లు, 2,996 వార్డు సభ్యుల పదవీకాలం పూర్తయినందున.. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. డెడికేషన్ కమిషన్ ఇప్పటికే నివేదిక ఇచ్చిందని, దాని ఆధారంగా రెండు రోజుల క్రితం రిజర్వేషన్లు ఖరారు చేశారు.

ఫిబ్రవరి 15న శివరాత్రి, ఆ మరుసటి రోజు రంజాన్ పండుగ, తదనంతరం విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్నందున.. వీలైనంత తొందరగా ఎన్నికలు జరపాలని నిర్ణయించారు. కాగా, మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు అధికార కాంగ్రెస్ కు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ మంత్రుల సమర్థతకు పరీక్ష పెడుతూ కీలక నిర్ణయం వెల్లడించారు.
మున్సిపల్ ఎన్నికల వేళ మంత్రులను పార్లమెంటరీ జిల్లాల వారీగా ఇంఛార్జ్ బాధ్యతలను కేటాయించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రతీ సీటు గెలవాల్సిందేనని సీఎం తేల్చి చెబుతున్నారు. హైకమాండ్ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటంతో.. మంత్రులకు కేటాయించిన జిల్లాల్లో ఫలితాలే వారి మంత్రి పదవి కొనసాగింపుకు కొలమానంగా సంకేతాలు ఇస్తున్నారు.
ఆదిలాబాద్ - సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ - ఉత్తమ్కుమార్ రెడ్డి, మల్కాజ్గిరి - కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, చేవెళ్ల - శ్రీధర్బాబు, మెదక్ - వివేక్, కరీంనగర్ - తుమ్మల నాగేశ్వరరావు, పెద్దపల్లి - జూపల్లి కృష్ణారావు, నల్గొండ - అడ్లూరి లక్ష్మణ్, భువనగిరి - సీతక్క, వరంగల్ - పొంగులేటి, మహబూబ్నగర్ - పొన్నం ప్రభాకర్, మహబూబ్నగర్ - దామోదర రాజనర్సింహా, జహీరాబాద్ - అజహరుద్దీన్, నాగర్కర్నూల్ - వాకిటి శ్రీహరి, ఖమ్మం - కొండా సురేఖకు బాధ్యతలు అప్పగించారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉండటం... ఈ ఫలితాలు తమ మంత్రి పదవికి పరీక్షగా మారటంతో మంత్రుల్లో ఉత్కంఠ మొదలైంది. దీంతో.. మున్సిపల్ ఎన్నికలు కేంద్రంగా చోటు చేసుకొనే పరిణామాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
-
రేపటి నుంచి గ్యాస్ సిలిండర్లు బంద్, షాకిచ్చిన ప్రభుత్వం -
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications