రైతుకు సంకెళ్లా?: సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్
రైతుకు సంకెళ్లు వేసిన ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. లగచర్ల దాడి కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రైతు హీర్యానాయక్కు సంగారెడ్డి జైలులో వైద్య పరీక్షల సమయంలో ఛాతినొప్పి వచ్చింది. దీంతో జైలు నుంచి ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ సందర్భంగా రైతు చేతులకు పోలీసులు బేడీలు వేయడం గమనార్హం. ఈ విషయం రేవంత్ రెడ్డికి దృష్టికి రావడంతో సీరియస్ అయ్యారు.
అధికారులతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు సీఎం రేవంత్ రెడ్డి. రైతుకు బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని హెచ్చరించారు.

అంతేగాక, హీర్యానాయక్కు మెరుగైన వైద్యం అందించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. కాగా, రైతు హీర్యానాయక్కు ఛాతినొప్పి రావడంతో మొదట సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ప్రస్తుతం హీర్యానాయక్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ అనిల్ కుమార్ తెలిపారు. హార్ట్ బీట్ కొంచెం తక్కువగా ఉందన్నారు.
గతంలో కూడా తనకు గుండె నొప్పి వచ్చిందని హీర్యానాయక్ చెప్పడంతో మెరుగైన చికిత్స కోసం పంజాగుట్ట నిమ్స్కు రిఫర్ చేశామని ఆయన తెలిపారు. దీంతో నిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలో హీర్యా నాయక్ కు చికిత్స అందిస్తున్నారు. ఇది ఇలావుండగా, రైతుకు బేడీలు వేయడంపై బీఆర్ఎస్ వర్కింగ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
రైతుకు గుండెనొప్పి వస్తే బేడీలు వేసి ఆస్పత్రికి తరలించడం క్షమార్హం కాదని కేటీఆర్ ధ్వజమెత్తారు. రైతులను కస్టడీలో చిత్రహింసలు పెట్టారని మెజిస్ట్రేట్ ముందు చెబితే... కుటుంబసభ్యులను కూడా కొడతామని బెదిరించారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట వినకపోవడమే వారు చేసిన తప్పా అని ప్రశ్నించారు.
దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
— Harish Rao Thanneeru (@BRSHarish) December 12, 2024
అనారోగ్యంతో బాధపడుతున్న లగచర్ల రైతుకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకువెళ్లడం హేయమైన చర్య.
ఇంత కంటే దారుణం ఏముంటుంది. రైతు హీర్యా నాయక్ ఉగ్రవాదా..? లేక దోపిడీ దొంగనా..?… pic.twitter.com/qJQG14Cbwq
దేశానికి అన్నం పెట్టే రైతన్నకు బేడీలు వేస్తారా? అని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు హీర్యానాయక్ ఏమైనా ఉగ్రవాదా? దోపిడీ దొంగా? అని ప్రశ్నించారు. రైతుల భూములు లాక్కుంటారని.. తిరగబడితే అరెస్టు చేస్తారని ధ్వజమెత్తారు. అనారోగ్యంతో ఉన్న రైతుకు బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లడం హేయమైన చర్య అని అన్నారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications