కాంగ్రెస్ ఎంపీ అభ్యర్దుల జాబితా సిద్దం - రేవంత్ పైనే భారం, లిస్టులో..!!
తెలంగాణ రాకీయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్ ఇప్పుడు లోక్ సభ సీట్ల పైన గురి పెట్టింది. ఈ రోజు జరిగిన పీఏసీ సమావేశంలో నెల ముందుగానే లోక్ సభ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని సీఎం రేవంత్ అప్రమత్తం చేసారు. దీంతో, లోక్ సభ సీట్ల వారీగా మంత్రులను ఇంఛార్జ్ లుగా నియమించారు. ఢిల్లీ పర్యటనలో అభ్యర్దుల ఖరారు పైన చర్చించనున్నారు. ఇప్పటికే జాబితా పైన ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం.
రేవంత్ కు బాధ్యతలు : తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో జార్టీ సీట్ల గెలుపు బాధ్యత హైకమాండ్ సీఎం రేవంత్ కు అప్పగించింది. లోక్ సభ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు సాధించాలని టార్గెట్ ఫిక్స్ చేసింది. దీంతో ముందుగానే అభ్యర్దులను ఖరారు చేసి ప్రజల్లోకి పంపాలని భావిస్తున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ అభ్యర్దుల ఎంపిక పైన ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. అభ్యర్దుల ఖరారులో రేవంత్ సూచనలకు ప్రాధాన్యత దక్కనుంది. అభ్యర్దులను ఏఐసీసీ అధికారికంగా ప్రకటించనుంది. 12 స్థానాల్లో ఇప్పటికే అభ్యర్దుల పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏకాభిప్రాయంతో వీరి పేర్లను అధికారికంగా ప్రకటించనుంది. నల్గొండ లోక్ సభ నుంచి జానారెడ్డి లేదా పటేల్ రమేశ్ రెడ్డి కి ఛాన్స్ దక్కనుంది.

రేసులో ముఖ్య నేతలు : మల్కాజ్ గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావును బరిలోకి దింపుతారనే ప్రచారం సాగుతున్నా తాజాగా కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఖమ్మం సీటు వామపక్షాలకు కేటాయించే ఛాన్స్ ఉంది. పెద్దపల్లి నుంచి వివేక్ కుమారుడు వంశీ, ఖమ్మం నుంచి రేణుకా చౌదరి లేదా పోట్ల నాగేశ్వరరావు పేర్లు రేసులో ఉన్నాయి. మహబూబాబాద్ నుంచి బలరాంనాయక్ లేదా విజయాబాయ్ లో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉంది. వరంగల్ నుంచి సిరిసిల్ల రాజయ్య లేదా మంత్రి పదవి ఇవ్వకపోతే అద్దంకి దయాకర్, దొమ్మాట సాంబయ్య పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. భువనగిరి నుంచి కోమటిరెడ్డి లక్ష్మ లేదా చామల కిరణ్ కుమార్ రెడ్డిలలో ఒకరిని ఎంపిక చేయనున్నారు. మహబూబ్ నగర్ నుంచి వంశీచందర్ రెడ్డి లేదా సీతా దయాకర్ రెడ్డిలలో ఒకరిని ఖరారు చేసే అవకాశం ఉంది.
ఇంఛార్జ్ లుగా మంత్రులు : మెదక్ నుంచి విజయశాంతిని బరిలో దింపుతారని సమాచారం. హైదరాబాద్ నుంచి అజాహరుద్దీన్ లేదా ఫిరోఖ్ ఖాన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ / నవీన్ యాదవ్ పేర్లు పరిశీలిస్తున్నారు. నిజామాబాద్ నుంచి ధర్మపురి సంజయ్/ జీవన్ రెడ్డిని బరిలోకి దింపే అవకాశం ఉంది. నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి పేరు వినిపిస్తోందది. చేవెళ్ల నుంచి కేఎల్ఆర్ లేదా కొత్తగా పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని చెబుతున్న బీజేపీ నేతకు ఛాన్స్ ఉంది. కరీంగనర్ నుంచి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి/ రోహిత్ రావు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదిలాబాద్ నుంచి నరేశ్ జాదవ్ పేరు పరిశీలించే ఛాన్స్ కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారికి తిరిగి అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు. అయితే, ప్రత్యామ్నాయం లేని నియోజవర్గాలు...ఖచ్చింగా గెలిచే అవకాశం ఉంటే మాత్రం మినహాయింపు ఇవ్వనున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications