తెలుగుజాతి రత్నం: ఘనంగా సినారె జన్మదిన వేడుకలు(పిక్చర్స్)
హైదరాబాద్: సాహితీవేత్త సి నారాయణ రెడ్డిని తెలుగు జాతికే గర్వకారణం అనడంకన్నా.. యావత్ ప్రపంచానికే గర్వకారణం అనడం సరైందని ఉమ్మడి రాష్ట్రాలలోకాయుక్త జస్టిస్ బి సుభాషణ్రెడ్డి అన్నారు. వంశీ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం రవీంద్రభారతిలో జరిగిన సి నారాయణరెడ్డి 85వ జన్మదినోత్సవ కార్యక్రమానికి జస్టిస్ సుభాషణ్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
సినారెకు కవి అనే పదం చాలా చిన్నదని, ఆయన ఒక వక్త, ఉపన్యాసకుడు, గాయకుడు, అత్యున్నత మానవతావాదని, అవన్నీ కలబోసిన సినారె.. ఒక సాహిత్య సంస్థ అన్నారు. సమానత్వం గురించి చాలా కవిత్వం రాశారని చెప్పారు. తుపాకీ(గన్) కంటే కలమే(పెన్) గొప్పదని అంటారని సుభాషణ్రెడ్డి తెలిపారు.

గీతాలాపన
సాహితీవేత్త సి నారాయణ రెడ్డిని తెలుగు జాతికే గర్వకారణం అనడంకన్నా.. యావత్ ప్రపంచానికే గర్వకారణం అనడం సరైందని ఉభయ రాష్ట్రాల లోకాయుక్త బి సుభాషణ్రెడ్డి అన్నారు.

సినారె
వంశీ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం రవీంద్రభారతిలో జరిగిన సి నారాయణరెడ్డి 85వ జన్మదినోత్సవ కార్యక్రమానికి జస్టిస్ సుభాషణ్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

సినారె పుస్తకావిష్కరణ
సినారెకు కవి అనే పదం చాలా చిన్నదని, ఆయన ఒక వక్త, ఉపన్యాసకుడు, గాయకుడు, అత్యున్నత మానవతావాదని, అవన్నీ కలబోసిన సినారె.. ఒక సాహిత్య సంస్థ అన్నారు.

జన్మదిన వేడుకలు
సమానత్వం గురించి చాలా కవిత్వం రాశారని చెప్పారు. తుపాకీ(గన్) కంటే కలమే(పెన్) గొప్పదని అంటారని సుభాషణ్రెడ్డి తెలిపారు. ‘క్షేత్రబంధం' పుస్తకంలోని ప్రతి పద్యంలో చాలామంచి అర్థం ఉందని అన్నారు.

జన్మదిన వేడుకలు
ఈ సందర్భంగా సినారెను సత్కరించారు. సినారె రాసిన క్షేత్రబంధం గ్రంథాన్ని ఆవిష్కరించి, మొదటి ప్రతిని స్వీకరించిన హూస్టన్ తెలుగు అసోసియేషన్ పూర్వాధ్యక్షురాలు శారద ఆకునూరిని సత్కరించారు.
‘క్షేత్రబంధం' పుస్తకంలోని ప్రతి పద్యంలో చాలామంచి అర్థం ఉందని అన్నారు. ఈ సందర్భంగా సినారెను సత్కరించారు. సినారె రాసిన క్షేత్రబంధం గ్రంథాన్ని ఆవిష్కరించి, మొదటి ప్రతిని స్వీకరించిన హూస్టన్ తెలుగు అసోసియేషన్ పూర్వాధ్యక్షురాలు శారద ఆకునూరిని సత్కరించారు.
నారాయణరెడ్డి మాట్లాడుతూ.. కవితా క్షేత్రానికి ముందు నాగలిపట్టి పొలాన్ని దున్నానని, ఆ సంఘటన గుర్తుకు వచ్చి ‘క్షేత్రబంధం' అనే పేరు పెట్టానని అన్నారు. సభకు అధ్యక్షత వహించి కెవి రమణాచారి మాట్లాడుతూ.. సినారె జన్మదినోత్సవాన్ని కవి సార్వభౌమానికి జరిగిన పట్టాభిషేకంగా అభివర్ణించారు.
శారద ఆకునూరి.. సినారె రాసిన కొన్ని పాటలలోని మొదటి వాఖ్యాలను జోడించి అభినందన మందారమాలగా తన గానంతో శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి శిరోమణి వంశీ రామరాజు స్వాగతం పలుకగా, సినారె సాహిత్యంతో గీతాంజలి స్వాగత గీతం ఆలపించింది.
తొలుత సినారె కలం నుండి జాలు వారిన పలు పాటలను శారద, గీతాంజలి, వినోద్బాబు ఆలపించారు. ఈ కార్యక్రమంలో తానా కోశాధికారి మురళి వెన్నెంగారు, వాడ్రేవు చిన వీరభద్రుడు పాల్గొన్నారు.
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!!












Click it and Unblock the Notifications