Congress: ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు..
బీఆర్ఎస్ పై తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రైతుబంధు నిధులను కేసీఆర్ నిబంధనలకు విరుద్దంగా కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేశారు. వికాస్ రాజ్ ను కలిసిన వారిలో రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్, పొంగులేటి, మధుయాష్కీ బీఆర్కే భవన్ లో వికాస్ రాజ్ తో సమావేశమయ్యారు.
బీఆర్ఎస్ ప్రభుత్వానికి.. సీఎం కేసీఆర్ కు ఎలాంటి అధికారం లేకపోయినా.. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్ అనుమతి లేకుండా నిధులు చెల్లిండం తప్పన్నారు. 6 వేల కోట్ల రైతుబంధు నిధులను మళ్లిస్తున్నట్లు వివరించారు. భూ రికార్డులు మారుస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. రంగారెడ్డి,సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని అసైన్డ్ ల్యాండ్ రికార్డులు మారుస్తున్నారని ఆరోపించారు.

-
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
ఉచిత బస్సే జిందా తిలిస్మాత్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..?












Click it and Unblock the Notifications