వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'రేవంత్‌ను దొంగ అంటున్న కేసీఆర్ గతంలో దొంగనోట్ల కేసులో దొంగ కాదా?'

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డిని దొంగ అంటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, గతంలో దొంగనోట్ల కేసులో దొంగ కాదా అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఆదివారం మండిపడ్డారు.

డబుల్ బెడ్ రూం పేరుతో ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు దొరికాయని, నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా తయారయిందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్నారు.

మాజీ ఎమ్మెల్ేయ వి,్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుస్తామని, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలన్నారు. తెరాస వచ్చాక పెన్షన్‌లు పోయాయన్నారు. రేవంత్‌ను దొంగ అంటున్న కేసీఆర్, గతంలో దొంగనోట్ల కేసులో దొంగ కాదా అని ప్రశ్నించారు.

హైదరాబాద్

ఒకే ఇంట్లో ఇద్దరికి పింఛన్లు ఉండొద్దని చెబుతున్న కేసీఆర్.. తన ఇంట్లో నలుగురికి ఉద్యోగాలు ఎందుకిచ్చారో చెప్పాలని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్లు ఏం చేశారని ప్రశ్నించారు. 14 ఎకరాల్లో సీఎం క్యాంప్ కార్యాలయం అవసరమా అని ప్రశ్నించారు.

సోమేష్ కుమార్ తెరాస తొత్తుగా మారారని దానం నాగేందర్ మండిపడ్డారు. ప్లాన్ ప్రకారం గ్రేటర్‌లో ఆంధ్రా వారి ఓట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. పేదలకు కేసీఆర్ ఈ ఏడాది కాలంలో ఏం చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహులకు పదవులు ఇచ్చారని ధ్వజమెత్తారు.

English summary
Congress party hot comments on KCR
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X