విశ్వ నగరమంటే ఇదేనా?: టిఆర్ఎస్పై కుంతియా ఫైర్
హైదరాబాద్: విశ్వనగరమంటే ఒక్క చినుకు పడితే నగరమంతా నదిలా ఉంటుందా అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇంచార్జీ ఆర్సీ కుంతియా విమర్శించారు తెరాస ప్రభుత్వ వైఫల్యంతో హైదరాబాద్ నగర పరిస్థితి దిగజారుతోందని ఆయన అనయనారు.
నగరంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని కుంతియా చెప్పారు. ఇటీవల వర్షానికి దెబ్బతిన్న బంజారాహిల్స్ నాయుడునగర్ ప్రాంతాన్ని బుధవారంనాడు కుంతియా కాంగ్రెస్ నేతలతో కలిసి పరిశీలించారు.

వర్షంతో గుడిసెలు కోల్పోయిన వారికి రూ.5 లక్షలు, చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని కుంతియా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బాధితులు నివాసం ఉండే ప్రాంతాల్లోనే రెండు పడకగదుల నివాసాలు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతిచెందిన కుటుంబాలకు దానం నాగేందర్ రూ. 30 వేల ఆర్థిక సాయం అందజేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నకాలంలో హైద్రాబాద్ను అభివృద్ది చేసిన విషయాన్ని కుంతియా గుర్తుచేశారు. కానీ, టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక హైద్రాబాద్ను సర్వనాశనం చేస్తోందని ఆయన ఆరోపణలు గుప్పించారు.
-
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications