టిఎస్ ఐపాస్కు ప్రశంస: సిఎం కెసిఆర్తో టాటా గ్రూప్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ(పిక్చర్స్)
నూతన తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానం (టిఎస్ ఐపాస్) చాలా బాగుందని టాటా గ్రూప్ కంపెనీల చైర్మన్ సైరస్ మిస్త్రీ ప్రశంసించారు. గురువారం సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమయంలో మంత్రి కెటిఆర్ కూడా అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా టిఎస్ ఐపాస్పై చర్చ జరిగింది.
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పరిశ్రమలకు కేవలం 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తుండటంపై మిస్త్రీ హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల పారిశ్రామికవేత్తలకు చాలా విలువైన సమయం ఆదా అవుతుందన్నారు.
పలు విభాగాలకు తిరగాల్సిన అవసరం లేకుండా చేజింగ్ సెల్ ద్వారా అనుమతులు ఇవ్వడంతో అనేకమంది ఔత్సాహికులు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ర్టానికి వస్తారని అన్నారు. తెలంగాణలో ఉన్న టాటా పరిశ్రమల గురించి కూడా ఈ సందర్భంగా చర్చించారు.
సిఎం కెసిఆర్తో మిస్త్రీ
నూతన తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానం (టిఎస్ ఐపాస్) చాలా బాగుందని టాటా గ్రూప్ కంపెనీల చైర్మన్ సైరస్ మిస్త్రీ ప్రశంసించారు.
సిఎం కెసిఆర్తో మిస్త్రీ
గురువారం సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టిఎస్ ఐపాస్పై చర్చ జరిగింది.
సిఎం కెసిఆర్తో మిస్త్రీ
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పరిశ్రమలకు కేవలం 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తుండటంపై మిస్త్రీ హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల పారిశ్రామికవేత్తలకు చాలా విలువైన సమయం ఆదా అవుతుందన్నారు.
సిఎం కెసిఆర్తో మిస్త్రీ
పలు విభాగాలకు తిరగాల్సిన అవసరం లేకుండా చేజింగ్ సెల్ ద్వారా అనుమతులు ఇవ్వడంతో అనేకమంది ఔత్సాహికులు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ర్టానికి వస్తారని అన్నారు.
జ్ఞాపిక అందజేస్తే..
తెలంగాణలో ఉన్న టాటా పరిశ్రమల గురించి కూడా ఈ సందర్భంగా చర్చించారు.
వీడ్కోలు పలుకుతూ..
హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ విస్తరణకు రూ.30 కోట్లు ఇస్తున్న విషయాన్ని సీఎం కేసీఆర్కు మిస్త్రీ తెలియజేశారు.