డెల్ కంపెనీ జిమ్లో వ్యాయామం చేస్తూ టెక్కీ మృతి
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. తాను పనిచేస్తున్న కంపెనీలోని జిమ్లో వ్యాయామం చేస్తూ ఒక్కసారిగా కూప్పకూలిపోయారు ఓ సాఫ్ట్వేర్ ఇంజినీరు.
హైదరాబాద్: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకరు తాను పనిచేస్తున్న కంపెనీలోని జిమ్లో వ్యాయామం చేస్తూ ఒక్కసారిగా కూప్పకూలిపోయాడు ఓ సాఫ్ట్వేర్ ఇంజినీరు. దీంతో అతడిని వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పకి తరలించారు.
అయితే, అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్సై విజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నంకు చెందిన వరుణ్కుమార్(22) మియాపూర్ మాతృశ్రీనగర్లో నివాసముంటున్నాడు.

ఇతను మాదాపూర్లోని డెల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. మంగళవారం మధ్యహ్నం 12గంటల ప్రాంతంలో కంపెనీ ఆవరణలో ఉన్న జిమ్కు వెళ్లారు. అక్కడ వ్యాయామం చేస్తూ ఛాతిలో ఒక్కసారిగా నొప్పిరావడంతో అక్కడే కూప్పకూలిపోయారు.
గమనించిన జిమ్ నిర్వాహకులు వెంటనే అతడ్ని మాక్స్ కేర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, వరుణ్ గత రెండు రోజులుగా ఛాతినొప్పితో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
గుండెపోటుతోనే మృతిచెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏడాది క్రితం నుంచి వరుణ్ ఈ కంపెనీలో పని చేస్తున్నాడని, ప్రతిరోజూ జిమ్ చేస్తుంటాడని పోలీసులు చెప్పారు.
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications