Year Ender 2024:తెలంగాణ పోలీసు సక్సెస్ రేటు ఎంత..!!
కాల గమనంలో మరో ఏడాది పూర్తయింది. 2024 కి వీడ్కోలు పలుకుతూ.. 2025 స్వాగతానికి సిద్దం అవుతోంది. ఈ 2024 లో తెలంగాణ లో శాంతి భద్రతల పరంగా పోలీసు శాఖ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. మరెన్నో లక్ష్యాలను చేరుకుంది. ఈ ఏడాది చివర్లో హీరో అల్లు అర్జున్ అరెస్ట్ పోలీసు శాఖ కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ అరెస్ట్ పై దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. ఇక.. డ్రగ్స్ పైన ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. 2024లో క్రైమ్ రిపోర్టును డీజీపీ జితేందర్ వెల్లడించారు.
రాష్ట్రంలో క్రైమ్ రేటు
తెలంగాణలో గత ఏడాది కంటే 2024 లో క్రైమ్ రేటు పెరిగింది. ఈ ఏడాది 9.87శాతం కేసుల సంఖ్య అధికంగా నమోదైంది. ఒకటి రెండు ఘటనలు మినహా రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు లోనే ఉన్నాయని డీజీపీ జితేందర్ వివరించారు. ఈ ఏడాది మొత్తం 2,34,158 కేసులు నమోదు కాగా, 85మంది నక్సల్స్ అరెస్ట్ అయినట్లు వెల్లడించారు. మరో 41 మంది సరెండర్ అయ్యారని చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 1942 డ్రగ్స్ కేసులు నమోదు కాగా అందులో 4682 మందిని అరెస్ట్ చేశారు. రూ 142.95 కోట్ల డ్రగ్స్ పట్టుకోగా .. జీరో శాతం డ్రగ్స్ దిశగా పోలీస్ శాఖ తగిన చర్యలు తీసుకుందని డీజీపీ వివరించారు.

పెరిగిన సైబర్ క్రైమ్
రాష్ట్రంలో ఈ ఏడాది సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయి. గత ఏడాది కంటే 43.33 శాతం మేర సైబర్ నేరాలు పెరిగినట్లు డీజీపీ చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 25,184 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా.. 180 కోట్లు వదిలిన ఫండ్స్ రీఫండ్ అయ్యాయని చెప్పారు. కాగా, రూ 247 కోట్లు విలువైన ఆస్తులను ఫ్రీజ్ చేసినట్లు తెలిపారు. కొత్త చట్టాలు వచ్చిన తరువాత 85,190 కేసులు నమోదు అయ్యాయని వివరించారు. జీరో ఎఫ్ఐఆర్ కింద 1,313 కేసులు కొత్త చట్టాలు వచ్చిన తరువాత నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది 547 మంది ఎస్ఐలు, 12,338 మంది కానిస్టేబుల్స్ నియామకం జరిగిందని చెప్పిన డీజీపీ... డయల్ 100 ద్వారా 16,92,173 కాల్స్ వచ్చినట్లు వివరించారు.
అల్లు అర్జున్ కేసు పై
2024 సంవత్సరంలో 20,702 రోడ్డు ప్రమాదాలు జరిగాయన్నారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 11,64,645 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుందని చెప్పారు. ఈ కేసులో సీబీఐకి లేఖ రాసినట్లు తెలిపారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్నవారిని అమెరికా నుండి ఇండియాకు రప్పించే విషయంలో విధానపరమైన ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. ఇప్పటికే ఇంటర్ పోల్ సహాయం తీసుకుంటున్నామని వెల్లడించారు. కాగా, ప్రభాకర్ రావును హైదరాబాద్ కు తీసుకురావడానికి సమయం పడుతుందని డీజీపీ స్పష్టం చేసారు. అల్లు అర్జున్ కేసు కోర్టు పరిధిలో ఉందని, ఆ కేసులో సమగ్ర విచారణ జరుగుతుందని డీజీపీ వివరించారు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications