ఐటీ మహిళా ఉద్యోగులను వేధిస్తున్నారా..! తాట తీస్తారు జాగ్రత్త..!!
హైదరాబాద్ : ఐటీ సంస్థల్లో పనిచేసే మహిళల భద్రతకు పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఐటీ ఉద్యోగినులను ఎవరైనా లైంగికండా వేదిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు నూతన మార్గాలను అణ్వేషిస్తున్నారు పోలీసులు. ఐటీ కంపెనీల్లో మహిళా ఉద్యోగులకు మార్గదదర్శక్లు అండగా ఉన్నారని, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల బారిన పడుతున్న బాధిత మహిళలకు రక్షణ కల్పిస్తున్నారు. వారి పనితీరును రాచకొండ సీపీ మహేష్ భగవత్ ప్రశంసించారు. నేరేడ్మెట్లోని కమిషనరేట్లో సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్సీఎస్సీ) ఆధ్వర్యంలో మార్గదర్శక్లతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్సీఎస్సీ ఐటీ కంపెనీల్లో మహిళల భద్రతకు అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా లైంగిక వేధింపులకు గురవుతున్న బాధిత మహిళలకు అండగా ఉండటానికి, వారి తరఫున పోలీసులతో మాట్లాడి ఫిర్యాదుతోపాటు, నిందితులపై చర్యలు తీసుకునేలా కృషి చేయడానికి ప్రతి కంపెనీలో కొందరు మహిళా ఉద్యోగులను ఎంపిక చేసి మార్గదర్శక్లుగా నియమించారు.

ఇక ఉద్యోగం చేసే ప్రదేశాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా బాధిత మహిళలు మార్గదర్శక్ల సహకారంతో పోలీసులను ఆశ్రయిస్తున్నారు. వీరి సహకారంతో అనేక కేసులు వెలుగులోకి వచ్చాయని సీపీ తెలిపారు. పనితీరు కనబర్చిన మార్గదర్శక్లకు ధ్రువపత్రాలు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న న్యాయవాదులు, సైకాలజిస్టులు, భూమిక స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు మహిళా చట్టాలు, కొత్తగా వచ్చిన మార్పులు, బాధితులు పోలీసులను సంప్రదించాల్సిన తీరు, షీటీమ్స్ పనితీరుతోపాటు ఉమెన్ సేఫ్టీ, ట్రాఫిక్, సైబర్ సెక్యూరిటీపై మరింత అవగాహన కల్పించారు. ఎస్సీఎస్సీ జనరల్ సెక్రటరీ కృష్ణ ఏదుల, జాయింట్ సెక్రటరీ, ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారి ప్రత్యూష శర్మ, మార్గదర్శక్ లీడర్ పద్మప్రియ, షీటీమ్స్ ఏడీసీపీ సలీమ, భూమిక స్వచ్చంద సంస్థ నిర్వాహకులు సత్యవతి తదితరులు పాల్గొన్నారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications