ఓ వైపు టీఆర్ఎస్ సభకు పరుగు!: బైక్-ట్రాలీ ఢీకొని గాల్లోకి ఎగిరి... (వీడియో)
Recommended Video
హైదరాబాద్: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో స్వల్ప ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ పైన ఉన్న యువకుడు దాని నుంచి ఎగిరి, గాల్లోనే ఓ రౌండ్ గింగిరీలు కొట్టి కిందపడ్డాడు.
ఓ వైపు టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభకు తెలంగాణవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వాహనాలు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. దీంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఔటర్ రోడ్ల పైకి రావొద్దని పోలీసులు, తెరాస కార్యకర్తలు తెలిపారు.
ప్రగతి నివేదన సభ నేపథ్యంలో రోడ్లలో అన్ని వాహనాలు దాదాపు కొంగర్ కలాన్ వైపు వెళ్తున్నాయి. ఈ సందర్భంగా ఓ ట్రక్ ఆటో వేగంగా వస్తుండగా, వ్యతిరేక దిశలో అంతే వేగంగా బైక్ పైన యువకుడు వస్తున్నాడు. ఆటో, బైక్ ఢీకొన్నాయి. దీంతో బైక్ పైన యువకుడు పైకి ఎగిరి ఓ రౌండ్ గాల్లోనే తిరిగి కిందపడ్డాడు. అతనికి స్వల్ప గాయాలు అయ్యాయి.
#WATCH: Dramatic visuals of a head-on collision between a two-wheeler and a mini truck in Ranga Reddy district. #Telangana pic.twitter.com/tbQxJiP0S7
— ANI (@ANI) September 2, 2018